త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

జమ్ముకశ్మీర్‌లో బయటపడ్డ పురాతన బౌద్ధ సంపద

J

National | Published On Dec 6, 2025, 7.21 am IST

జమ్ముకశ్మీర్‌లో బయటపడ్డ పురాతన బౌద్ధ సంపద
Advertisement

జమ్ముకశ్మీర్‌లో అద్భుత ఘట్టం ఆవిష్కారమైంది. బారాముల్లా జిల్లాలో బౌద్ధ సంపద బయటపడింది. జిల్లాలోని జెహన్‌పోరా అనే ప్రాంతంలో అత్యంత పురాతనమైన, విశాలమైన బౌద్ధ సముదాయం ఆనవాళ్లు బయటపడ్డాయి. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా బౌద్ధ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా ఉండేదని చెప్పేందుకు ఈ తవ్వకాల్లో బయటపడ్డ బౌద్ధ సముదాయం నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.

జమ్ముకశ్మీర్‌కు చెందిన పురావస్తు శాఖ అధికారులు, కశ్మీర్ యూనివర్సిటీలోని సెంటర్ ఆఫ్ సెంట్రల్ ఏషియన్ స్టడీస్ సంయుక్తంగా ఈ తవ్వకాలను చేపట్టాయి. ఈ తవ్వకాల్లో కుషానుల కాలం నాటి ఆనవాళ్లు వెలుగు చూశాయి. కుషానులు క్రీ.శ. 1 నుంచి 3 శతాబ్దానికి చెందిన వారు. వాళ్ల నిర్మాణాలు తాజాగా వెలుగు చూశాయి. స్థూపాలు, గోడలు, మట్టి పాత్రలు, రాగి వస్తువులు బయటపడ్డాయి. కుషానుల కాలం నాటి జీవన విధానానికి అవి అద్దం పడుతున్నాయి.

కశ్మీర్ లోయలో ఒకప్పుడు బౌద్ధ మతం ఎంత బలంగా ఉండేదో చెప్పేందుకు ఈ తవ్వకాలే ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తున్నాయి. కశ్మీర్ యూనివర్సిటీలోని సీసీఏఎస్ పరిశోధకులు డ్రోన్ సర్వే, మ్యాపింగ్ ద్వారా ఈ ప్రదేశాన్ని గుర్తించి గత కొన్ని రోజులుగా తవ్వకాలు ప్రారంభించారు.

చరిత్రలో ఇది కొత్త అధ్యాయం అని కశ్మీర్, బౌద్ధ మత చరిత్ర ఆనవాళ్లు ఇంకా లభించడం వల్ల రాబోయే రోజుల్లో ఈ ప్రదేశాన్ని పర్యాటక, చారిత్రక ప్రదేశంగా మార్చే అవకాశం ఉండొచ్చని కశ్మీర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement