త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | అమెరికా-ఇరాన్ మ‌ధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని స్వాగ‌తించిన ప్ర‌ధాని మోదీ

PM Modi | అమెరికా-ఇరాన్ మ‌ధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) స్వాగ‌తించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

D

National | Published On Jun 15, 2026, 1.49 pm IST

PM Modi | అమెరికా-ఇరాన్ మ‌ధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని స్వాగ‌తించిన ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | ప్ర‌పంచాన్ని తీవ్ర సంక్షోభం వైపు న‌డిపించిన ప‌శ్చిమాసియా (West Asia) ఉద్రిక్త‌త‌ల‌కు తెర‌ప‌డింది. ఇరాన్‌తో సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధానికి అమెరికా (US Iran War) ముగింపు ప‌లికింది. ఇరాన్‌తో (Iran) శాంతి ఒప్పందం కుదిరింద‌ని (Peace Deal) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన విష‌యం తెలిసిందే. దీనిపై భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. అమెరికా-ఇరాన్ మ‌ధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

"ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా తీవ్ర ఆర్థిక న‌ష్టాన్ని క‌లిగించాయి. ఎన్నో దేశాల్లో ప్రాణనష్టానికి కార‌ణ‌మైన ఈ యుద్ధానికి ముగింపు ప‌లికేలా అమెరికా-ఇరాన్ ఓ అంగీకారానికి రావ‌డం స్వాగ‌తించే విష‌యం. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వాలను పునరుద్ధరించడం, స్వేచ్ఛా నౌకాయానం, వాణిజ్యానికి భరోసా కల్పించడంలో ఈ పరిణామం సాయపడుతుందని భారత్ విశ్వసిస్తోంది. మిగిలిన స‌మ‌స్య‌ల‌పై కూడా చ‌ర్చ‌లు జ‌రిపి.. ఓ స్థిర‌మైన తుది ఒప్పందం కుదురుతుంద‌ని ఆశిస్తున్నాం" అని ప్ర‌ధాని త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Also Read..

తుదిదశలో అహ్మదాబాద్‌ విమాన ప్రమాద దర్యాప్తు.. త్వ‌ర‌లోనే నివేదిక : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

ప్ర‌జ‌ల‌ను కుక్క‌ల‌తో పోల్చేంత క‌ఠిన హృద‌యుడిని కాదు : రాఘవ లారెన్స్

200 అడుగుల లోతైన‌ బావిలో ప‌డిన ఆవు.. త‌ర్వాత‌ ఏం జ‌రిగిందంటే!

Advertisement
Advertisement