త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Train Fire | త‌ప్పిన ప్రాణ‌న‌ష్టం.. ప్యాసింజ‌ర్‌ రైలులో చెల‌రేగిన మంట‌లు.. మూడు బోగీలు ద‌గ్ధం

Train Fire | బీహార్‌లోని (Bihar) స‌హ‌ర్సా జిల్లాలో భారీ ప్రాణ‌న‌ష్టం త‌ప్పింది. ప్ర‌యాణికులంతా గాఢ‌ నిద్ర‌లో ఉన్న స‌మ‌యంలో ఓ ప్యాసింజ‌ర్ రైలులో మంట‌లు చెల‌రేగాయి (Train Fire). దీంతో మూడు బోగీలు అగ్నికి ఆహుత‌య్యాయి.

G

National | Published On Aug 3, 2026, 10.18 am IST

Train Fire | త‌ప్పిన ప్రాణ‌న‌ష్టం.. ప్యాసింజ‌ర్‌ రైలులో చెల‌రేగిన మంట‌లు.. మూడు బోగీలు ద‌గ్ధం
Advertisement

Train Fire | త్రినేత్ర‌.న్యూస్‌: బీహార్‌లోని (Bihar) స‌హ‌ర్సా జిల్లాలో భారీ ప్రాణ‌న‌ష్టం త‌ప్పింది. ప్ర‌యాణికులంతా గాఢ‌ నిద్ర‌లో ఉన్న స‌మ‌యంలో ఓ ప్యాసింజ‌ర్ రైలులో మంట‌లు చెల‌రేగాయి (Train Fire). దీంతో మూడు బోగీలు అగ్నికి ఆహుత‌య్యాయి. అయితే ప్ర‌యాణికులంతా క్షేమంగా బ‌య‌ట‌ప‌డ‌టంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

స‌మ‌స్తిపూర్‌-స‌హ‌ర్సా ప్యాసింజ‌ర్ (నంబ‌ర్ 63344) రైలు (Passenger Train) సోమ‌వారం తెల్ల‌వారుజామున 3.40 గంట‌ల స‌మ‌యంలో సిమ్రి బ‌ఖ్తియార్‌పూర్ రైల్వేస్టేష‌న్‌కు చేరుకుంది. రైలు రెండో నంబ‌ర్‌ ప్లాట్‌ఫామ్‌పై ఉండ‌గా.. ఇంజిన్ నుంచి పొగ‌, ఆ త‌ర్వాత మంట‌లు రావ‌డం (Fire Accident) ప్రారంభ‌మ‌య్యాయి. అవి క్ర‌మంగా ప‌క్క‌నే ఉన్న బోగీల‌కు అంటుకున్నాయి. దీంతో స్టేష‌న్ మొత్తం ద‌ట్ట‌మైన పొగ క‌మ్ముకుంది. బోగీల్లో పెద్దఎత్తున మంట‌లు ఎగ‌సిప‌డ్డాయి.

గ‌మ‌నించిన ప్ర‌యాణికులు అంతా కింది దిగిపోయారు. ఈ క్ర‌మంలో ప్లాట్‌ఫామ్‌పై స్వ‌ల్ప తొక్కిస‌లాట చోటుచేసుకుంది. రైల్వే సిబ్బంది, పోలీసులు మంట‌ల‌ను ఆర్పివేశారు. అయితే అప్ప‌టికే మూడు బోగీలు పూర్తిగా ద‌గ్ధ‌మ‌య్యాయి. ఈ ప్ర‌మాదంలో ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేద‌ని అధికారులు తెలిపారు. మంటలు అంటుకోవ‌డానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేద‌ని, ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

Advertisement
Advertisement