త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suicide Blast | పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి

Suicide Blast | పాకిస్థాన్‌లోని ఖైబ‌ర్ ప‌ఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో భారీ పేలుడు సంభ‌వించింది. స్వాత్ లోయ‌లోని (Swat Valley) క‌బ‌ల్ ప‌ట్ట‌ణంలో ఆదివారం సాయంత్రం శాంతియాత్ర (Peace Rally) నిర్వ‌హిస్తున్నారు.

G

International | Published On Aug 3, 2026, 8.01 am IST

Suicide Blast | పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి
Advertisement

Suicide Blast | త్రినేత్ర‌.న్యూస్‌: పాకిస్థాన్‌లోని ఖైబ‌ర్ ప‌ఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో భారీ పేలుడు సంభ‌వించింది. స్వాత్ లోయ‌లోని (Swat Valley) క‌బ‌ల్ ప‌ట్ట‌ణంలో ఆదివారం సాయంత్రం శాంతియాత్ర (Peace Rally) నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ఆత్మాహుతి దాడిలో (Suicide Blast) 14 మంది చ‌నిపోగా, మ‌రో 22 మంది గాయ‌ప‌డ్డారు. మృతుల్లో ఐదుగురు పోలీసులు కాగా, తొమ్మిది మంది సాధార‌ణ పౌరులు.

శాంతికోసం ర్యాలీ..

స్వాత్ ప్రాంతంలో (Swat District) గ‌త కొంత‌కాలంగా భ‌ద్ర‌తా ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అమ‌న్ జిర్గా ఆధ్వ‌ర్యంలో స్థానిక ప్ర‌జ‌లు యాత్ర చేప‌ట్టారు. ఇందులో పెద్ద సంఖ్య‌లో ప్ర‌జలు పాల్గొన్నారు. ఈ స‌మ‌యంలో ఒక్క‌సారిగా భారీ పేలుడు సంభ‌వించింది. దీంతో భ‌యాందోళ‌న‌ల‌కు గురైన ప్ర‌జ‌లు ప‌రుగులు తీశారు. ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండొచ్చ‌ని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సంస్థ కూడా బాధ్య‌త‌వ‌హించ‌లేదు. పేలుడు వెనుక ఏదైనా సంస్థ ఉందా లేదా వ్య‌క్తులే దీనికి పాల్ప‌డ్డారా అని పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా, పేలుడు తీవ్ర‌త అధికంగా ఉండ‌టం, గాయ‌ప‌డిన‌వారిలో ప‌లువురి పరిస్థితి విష‌మంగా ఉండ‌టంతో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement