NIACL | న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో అప్రెంటిస్లు.. ఏడాది శిక్షణతో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో అవకాశాలు..
NIACL | ప్రభుత్వరంగ జనరల్ ఇన్సూరెన్స్ (general insurance) సంస్థ అయిన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) అప్రెంటీస్ డ్రైవ్ నిర్వహిస్తున్నది. నేషనల్ అప్రెంటిస్షిప్ (Apprentice) ట్రైనింగ్ స్కీమ్ (NATS)లో భాగంగా 550 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తున్నది.
NIACL | త్రినేత్ర.న్యూస్: ప్రభుత్వరంగ జనరల్ ఇన్సూరెన్స్ (general insurance) సంస్థ అయిన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) అప్రెంటీస్ డ్రైవ్ నిర్వహిస్తున్నది. నేషనల్ అప్రెంటిస్షిప్ (Apprentice) ట్రైనింగ్ స్కీమ్ (NATS)లో భాగంగా 550 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 6 వరకు www.newindia.co.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాది కాలం పాటు శిక్షణ ఇస్తారు. ప్రతినెల రూ.12,300 స్టెయిఫండ్ అందిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. తెలంగాణలో 18, ఆంధ్రప్రదేశ్లో 17 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 550
ఇందులో తెలంగాణలో 18 (ఎస్సీ 2, ఎస్టీ 1, ఓబీసీ 5, ఈడబ్ల్యూఎస్ 1, జనరల్ 9), ఏపీలో 17 (ఎస్సీ 2, ఎస్టీ 1, ఓబీసీ 4, ఈడబ్ల్యూఎస్ 1, జనరల్ 9) చొప్పున ఉన్నాయి.
అర్హతలు: డిగ్రీ పూర్తి ఉండాలి. 2022, జనవరి 1కి ముందు, 2026, జూన్ 1 తర్వాత డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులు కాదు. అభ్యర్థులు 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, బీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులకు ఉంటాయి. జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 25 చొప్పున 100 ప్రశ్నలు అడుగుతారు. గంట వ్యవధిలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఫలితాలు, ఇంటర్య్వూ సమాచారం beep.bfsissc.com వెబ్సైట్ ద్వారా తెలియజేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ
అభ్యర్థులు ముందుగా ఎన్ఏటీఎస్ పోర్టల్లో (https://nats.education.gov.in) రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత https://beep.bfsissc.com/candidate_login పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 6
అప్లికేషన్ ఫీజు: రూ.800 (పురుషులు), రూ.600 (మహిళలు), ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.200. జీఎస్టీ (18 శాతం) అదనం.
రాతపరీక్ష: జూలై 12
వెబ్సైట్: www.newindia.co.in
తాజావార్తలు
- ●ITR Refund | ఐటీఆర్ రీఫండ్ త్వరగా రావాలంటే ఇదే సీక్రెట్.. 7 రోజుల్లోనే డబ్బు ఖాతాలోకి..
- ●Cheyutha Pension | వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. దరఖాస్తులు స్వీకరించనున్న సర్కార్!
- ●PM Modi | ఎమర్జెన్సీ రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి : ప్రధాని మోదీ
- ●Balakrishna | నారా లోకేష్ క్లాప్తో మొదలైన బాలకృష్ణ కొత్త సినిమా - స్పెషల్ అట్రాక్షన్గా నందమూరి తేజస్విని
- ●South Africa vs South Korea | తొలిసారి నాకౌట్కు సౌతాఫ్రికా.. సౌత్ కొరియాకు భారీ షాక్!
- ●Mozilla | మొజిల్లా ఫైర్ఫాక్స్లో కొత్త ఏఐ ఫీచర్.. ఫోన్ షేక్ చేస్తే వెబ్పేజీ సారాంశం సిద్ధం..

ITR Refund | ఐటీఆర్ రీఫండ్ త్వరగా రావాలంటే ఇదే సీక్రెట్.. 7 రోజుల్లోనే డబ్బు ఖాతాలోకి..

Cheyutha Pension | వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. దరఖాస్తులు స్వీకరించనున్న సర్కార్!

PM Modi | ఎమర్జెన్సీ రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి : ప్రధాని మోదీ

Balakrishna | నారా లోకేష్ క్లాప్తో మొదలైన బాలకృష్ణ కొత్త సినిమా - స్పెషల్ అట్రాక్షన్గా నందమూరి తేజస్విని





