త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BKC Mumbai Car Free Friday | ట్రాఫిక్ కష్టాలకు చెక్: ముంబై బీకేసీలో ‘కార్-ఫ్రీ ఫ్రైడే’.. ఇకపై ప్రతి శుక్రవారం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డే!

ముంబైలోని అత్యంత రద్దీ ప్రాంతమైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా 'కార్-ఫ్రీ ఫ్రైడే' తీసుకొచ్చింది.

J

National | Published On Jun 8, 2026, 2.02 pm IST

BKC Mumbai Car Free Friday | ట్రాఫిక్ కష్టాలకు చెక్: ముంబై బీకేసీలో ‘కార్-ఫ్రీ ఫ్రైడే’.. ఇకపై ప్రతి శుక్రవారం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డే!
Advertisement
  • ముంబై బీకేసీ (BKC) లో ప్రతి శుక్రవారం 'పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డే' (కార్-ఫ్రీ ఫ్రైడే) అమలు
  • సుమారు 2 లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగులు కారు/క్యాబ్ బదులు మెట్రో, బస్సు, లోకల్ ట్రైన్ వాడాలని అధికారుల సూచన
  • మెట్రో లైన్-3 (ఆక్వా లైన్) అందుబాటులోకి వచ్చినా, లాస్ట్-మైల్ కనెక్టివిటీ (Last-mile connectivity) లేక ఇంకా 52% మంది ప్రైవేట్ వాహనాలే వాడుతున్నారు
  • కనెక్టివిటీ, మెరుగైన బస్సు సౌకర్యాలు కల్పిస్తే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడతామంటున్న 82% ఉద్యోగులు

BKC Mumbai Car Free Friday | త్రినేత్ర.న్యూస్ : ముంబైలో ట్రాఫిక్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) ఒకటి. దేశంలోని అత్యంత రద్దీ వ్యాపార కేంద్రాల్లో ఒకటైన ఇక్కడ ప్రతిరోజూ లక్షలాది మంది కార్పొరేట్ ఉద్యోగులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ ట్రాఫిక్ కష్టాలకు, కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA) ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అదే 'కార్-ఫ్రీ ఫ్రైడే' (Car-Free Friday).

అసలేంటి ఈ ప్రయోగం?

ఇకపై ప్రతి శుక్రవారం బీకేసీలో పనిచేసే సుమారు 2 లక్షల మంది ప్రొఫెషనల్స్ తమ సొంత కార్లు, క్యాబ్స్‌ (Cabs) కు బదులుగా.. మెట్రో, బస్సు లేదా లోకల్ ట్రైన్స్ (Public Transport) వాడాలని అధికారులు ప్రోత్సహిస్తున్నారు. బెస్ట్ (BEST), ట్రాఫిక్ పోలీస్, ముంబై మెట్రో (MMRCL) సంయుక్తంగా ఈ డ్రైవ్ చేపడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 90 పెద్ద, చిన్న కార్పొరేట్ కంపెనీలు ఈ ఇనిషియేటివ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.

శుక్రవారమే ఎందుకు? సోమవారం ఎందుకు కాదు?

ఈ డౌట్ మీకు వచ్చే ఉంటుంది. సోమవారం (Monday) అనగానే డెడ్‌లైన్లు, మీటింగ్స్, ఉదయం 9 గంటలకే డెస్క్ దగ్గర ఉండాలన్న టెన్షన్ ఉంటాయి. ఇలాంటి ఒత్తిడి సమయంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడటానికి ఉద్యోగులు పెద్దగా ఆసక్తి చూపరు. అదే వీకెండ్ మూడ్‌లో ఉండే శుక్రవారాన్ని (Friday) ఎంచుకుంటే, ఆరోజు కాస్త ఫ్లెక్సిబుల్ షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి, ఉద్యోగులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను వాడటానికి సుముఖంగా ఉంటారని అధికారుల ప్లాన్.

అసలు సమస్య 'లాస్ట్ మైల్ కనెక్టివిటీ'

మెట్రో లైన్-3 (Aqua Line) అందుబాటులోకి వచ్చినా, బీకేసీలోని 52 శాతం వర్క్‌ఫోర్స్ ఇంకా సొంత వాహనాలు, ఆటోలపైనే ఆధారపడుతున్నారు. కేవలం 25 శాతం మంది మాత్రమే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. మెట్రో స్టేషన్ దిగాక ఆఫీసుకి వెళ్లే ఆ 1-2 కిలోమీటర్ల దూరం (Last-mile connectivity) ప్రయాణించడమే!

"మెట్రోలో ప్రయాణం సాఫీగానే ఉంటుంది. కానీ స్టేషన్ దిగగానే షేర్ ఆటోల కోసం, ఫీడర్ బస్సుల కోసం పడిగాపులు కాయడం రోజువారీ నరకంగా మారింది" అని ఓ ఫైనాన్షియల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ వాపోయారు.

పరిష్కారాల దిశగా అడుగులు..

ఉద్యోగులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వైపు మళ్లాలంటే సౌకర్యాలు మెరుగుపరచాలి. దీనికోసం అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు.

బస్సుల ఫ్రీక్వెన్సీ: ప్రస్తుతం 20-25 నిమిషాలకు ఒక బెస్ట్ (BEST) బస్సు వస్తుండగా, వాటిని వేగంగా తిప్పేందుకు వీలుగా కీలక కూడళ్ల వద్ద ప్రత్యేక యూ-టర్న్‌ (U-turns) సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.

వాకింగ్ కారిడార్స్: నడిచి వెళ్లేవారి కోసం చెట్ల నీడ, వేసవిలో ఇబ్బంది లేకుండా మిస్ట్ బ్లోయర్స్ (Mist blowers), ఆల్-వెదర్ కారిడార్స్ నిర్మించాలని అర్బన్ ప్లానర్స్ సూచించారు.

రివార్డులు: పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడే ఉద్యోగులకు ట్రావెల్ అలవెన్స్, రివార్డ్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలని కంపెనీలను కోరుతున్నారు.

ఈ ప్రయోగాన్ని కనీసం మూడు నాలుగు నెలల పాటు కొనసాగించి, వచ్చే ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులు భావిస్తున్నారు. లాస్ట్-మైల్ కనెక్టివిటీని అధికారులు ఎంత త్వరగా మెరుగుపరుస్తారన్న దానిపైనే ఈ 'కార్-ఫ్రీ ఫ్రైడే' సక్సెస్ ఆధారపడి ఉంది.

Advertisement
Advertisement