త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

రోజుకు 5వేల కోసం.. కూతురుతో ఆ ప‌ని చేయిస్తున్న క‌న్న‌ తండ్రి

క‌ర్ణాట‌క‌లోని మంగ‌ళూరులో (Mangaluru) దారుణం చోటుచేసుకున్న‌ది. రోజుకు రూ.5 వేల కోసం క‌క్కుర్తిప‌డిన ఓ తండ్రి క‌న్న కూతురితో చెప్పుకోరాని (Prostitution) ప‌నిచేయిస్తున్నాడు.

G

National | Published On Jan 8, 2026, 9.12 am IST

రోజుకు 5వేల కోసం.. కూతురుతో ఆ ప‌ని చేయిస్తున్న క‌న్న‌ తండ్రి
Advertisement

trinethra.new: క‌ర్ణాట‌క‌లోని మంగ‌ళూరులో (Mangaluru) దారుణం చోటుచేసుకున్న‌ది. రోజుకు రూ.5 వేల కోసం క‌క్కుర్తిప‌డిన ఓ తండ్రి క‌న్న కూతురితో చెప్పుకోరాని (Prostitution) ప‌నిచేయిస్తున్నాడు. తండ్రికి నాన‌మ్మ కూడా తోడ‌వ‌డంతో ఆ యువ‌తి ప‌లువురి వాంఛ‌కు బ‌లైపోయింది. వారి వేధింపులు త‌ట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్ర‌యించ‌డంతో ఈ ఘటన వెలుగులోకి వ‌చ్చింది.

చిక్క‌మంగ‌ళూరు జిల్లా అజ్జంపూర్‌కు చెందిన గిరీశ్‌కు 17 ఏండ్ల కూతురు ఉన్న‌ది. ఆరేండ్ల క్రితం ఆమె త‌ల్లి మ‌ర‌ణించింది. దీంతో నాన‌మ్మ నాగ‌ర‌త్న‌, తండ్రితో క‌లిసి ఉంటున్న‌ది. ఈ క్ర‌మంలో ఆ యువ‌తితో ప‌డుపు వృత్తి చేయిస్తే రోజుకు రూ.5 వేలు ఇస్తామ‌ని ప‌లువురు గిరీశ్‌కు ఆశ‌చూపారు. దీంతో త‌న త‌ల్లితో క‌లిసి ఆ మైన‌ర్ బాలిక‌ను ఆమె తండ్రి ప‌డుపు వృత్తిలోకి దించాడు. అంత‌కు ముందే మంగ‌ళూరుకు చెందిన భ‌ర‌త్ శెట్టి అనే వ్య‌క్తి మ‌రో న‌లుగురితో క‌లిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.

త‌న‌కు రుతుస్రావం అవుతుంద‌న్నా విన‌కుండా ఆరు రోజుల‌పాటు బ‌ల‌వంతంగా లైంగిక దాడి చేశారు. తండ్రి, నాన‌మ్మ, త‌న‌తో ప‌డుపు వృత్తి చేయిస్తున్న‌వారి వేధింపులు బ‌రించ‌లేక‌పోయిన ఆమె.. ఎలాగోలా త‌ప్పించుకుని బీరూరు పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఆమె ఫిర్యాదుతో కేసు న‌మోదుచేసి, బాధితురాలి తండ్రి, నాన‌మ్మ స‌హా ప‌ది మందిని అరెస్టు చేశారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాధితురాలిని బాల‌స‌ద‌న్‌కు పంపించామ‌ని జిల్లా ఎస్పీ జితేంద‌ర్ కుమార్ ద‌యామ తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement