త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maoists | గ‌డ్చిరోలిలో మళ్లీ మావోయిస్టుల క‌ద‌లిక‌లు

Maoists | ఇప్ప‌టికే టాప్ మావోయిస్టు కేడ‌ర్ లొంగిపోయిన‌ప్ప‌టికీ.. అక్క‌డ‌క్క‌డ దాగి ఉన్న న‌క్స‌ల్స్ ఏరివేత‌కు చ‌ర్య‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా మ‌హారాష్ట్ర గ‌డ్చిరోలిలో మావోయిస్టుల క‌ద‌లిక‌లు తీవ్ర అల‌జ‌డిని సృష్టిస్తున్నాయి.

S

National | Published On Jul 14, 2026, 5.17 pm IST

Maoists | గ‌డ్చిరోలిలో మళ్లీ మావోయిస్టుల క‌ద‌లిక‌లు
Advertisement

Maoists | త్రినేత్ర‌.న్యూస్ : ఇప్ప‌టికే టాప్ మావోయిస్టు కేడ‌ర్ లొంగిపోయిన‌ప్ప‌టికీ.. అక్క‌డ‌క్క‌డ దాగి ఉన్న న‌క్స‌ల్స్ ఏరివేత‌కు చ‌ర్య‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా మ‌హారాష్ట్ర గ‌డ్చిరోలిలో మావోయిస్టుల క‌ద‌లిక‌లు తీవ్ర అల‌జ‌డిని సృష్టిస్తున్నాయి. ఎట‌ప‌ల్లి తాలుకాలో మావోయిస్టుల క‌ర‌ప‌త్రాలు ల‌భించాయి. జువేలి, పిప్లి, బుర్గి గ్రామాల్లో క‌ర‌ప‌త్రాలు ల‌భ్యం కావ‌డంతో ఆ ప్రాంతాల్లో భ‌ద్ర‌తా బల‌గాలు భారీగా మోహ‌రించారు. మావోల ఆచూకీ కోసం ఆ ప్రాంతాల‌ను జ‌ల్లెడ ప‌డుతున్నారు పోలీసులు.

అశోక్ కామ్రేడ్ పేరుతో విడుదలైన లేఖలో ఇనుప ఖనిజ కంపెనీలకు వ్యతిరేకంగా ప్రజలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. కొత్త, పాత మైనింగ్ ప్రాజెక్టులను పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. స్థానిక గ్రామ స‌ర్పంచ్‌ల‌తో పాటు ప్ర‌జ‌లు ఈ కంపెనీల‌ను తీవ్రంగా వ్య‌తిరేకించాల‌ని సూచించారు.

Advertisement
Advertisement