త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ajit Pawar | నేను ఊపిరి పీల్చుకున్నా.. 18 నెల‌ల క్రితం అజిత్ ప‌వార్ కీల‌క వ్యాఖ్య‌

Ajit Pawar | మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్‌కు 18 నెల‌ల క్రిత‌మే పెను ప్ర‌మాదం త‌ప్పింది. 2024 జులై నెల‌లో ద‌ట్ట‌మైన మేఘాల కార‌ణంగా దృశ్య‌మాన‌త లోపించ‌డంతో.. తాను ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్ దారి త‌ప్పింది. దాంతో అజిత్ ప‌వార్ తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

S

National | Published On Jan 28, 2026, 2.55 pm IST

Ajit Pawar | నేను ఊపిరి పీల్చుకున్నా.. 18 నెల‌ల క్రితం అజిత్ ప‌వార్ కీల‌క వ్యాఖ్య‌
Advertisement

Ajit Pawar | త్రినేత్ర‌.న్యూస్ : మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్‌కు 18 నెల‌ల క్రిత‌మే పెను ప్ర‌మాదం త‌ప్పింది. 2024 జులై నెల‌లో ద‌ట్ట‌మైన మేఘాల కార‌ణంగా దృశ్య‌మాన‌త లోపించ‌డంతో.. తాను ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్ దారి త‌ప్పింది. దాంతో అజిత్ ప‌వార్ తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ఇక హెలికాప్ట‌ర్ సుర‌క్షితంగా ల్యాండైన త‌ర్వాత తాను ఊపిరి పీల్చుకున్నాన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

అస‌లేం జ‌రిగిందంటే..?

2024 జులై నెల‌లో నాగ్‌పూర్ నుంచి సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి ఉద‌య్ సామంత్‌తో క‌లిసి అజిత్ ప‌వార్ గ‌డ్చిరోలిలో స్టీల్ ప్రాజెక్టు ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసేందుకు బ‌య‌ల్దేరారు. ఇక ద‌ట్ట‌మైన మేఘాల‌ను చూసి అజిత్ ప‌వార్ భ‌య‌ప‌డిపోయారు. త‌న‌తో పాటు సీఎం, మంత్రికి కిటికీ గుండా ఆ దృశ్యాల‌ను చూపిస్తూ.. ఆందోళ‌న‌కు గుర‌య్యారు అజిత్ ప‌వార్. ఇక దృశ్య‌మాన‌త లోపించ‌డం కార‌ణంగా హెలికాప్ట‌ర్ కూడా దారి త‌ప్పింది.

ఈ క్ర‌మంలో ఫ‌డ్న‌వీస్ క‌ల్పించుకుని.. ఏం భ‌య‌ప‌డ‌కండి.. ధైర్యంగా ఉండాల‌ని అజిత్‌కు భ‌రోసానిచ్చారు. ఎందుకంటే ఇలాంటి ఆరు ప్ర‌మాదాల నుంచి ఫ‌డ్న‌వీస్ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. కాబ‌ట్టి ఆ ధైర్యంతోనే అజిత్‌కు భ‌రోసా ఇచ్చారు. మొత్తానికి పైల‌ట్ త‌న నైపుణ్యంతో.. హెలికాప్ట‌ర్‌ను సుర‌క్షితంగా గ‌డ్చిరోలిలో ల్యాండ్ చేశారు.

గ‌డ్చిరోలిలో స్టీల్ ప్రాజెక్టు ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన అనంత‌రం అజిత్ ప‌వార్ మాట్లాడుతూ.. గాల్లో ఉండ‌గా చోటు చేసుకున్న ప‌రిణామాన్ని గుర్తు చేసుకున్నారు. ద‌ట్ట‌మైన మేఘాల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన హెలికాప్ట‌ర్ కిటికీలో నుంచి త‌న‌కు ప‌క్క‌నే సామంత్ ల్యాండింగ్ ప్ర‌దేశానికి వ‌చ్చామ‌ని చూపించ‌డంతో తాను ఊపిరి పీల్చుకున్నాన‌ని అజిత్ ప‌వార్ చెప్పారు.

18 నెల‌ల త‌ర్వాత

స‌రిగ్గా 18 నెల‌ల త‌ర్వాత అజిత్ ప‌వార్ విమాన ప్ర‌మాదంలో చ‌నిపోవ‌డం అంద‌రినీ క‌ల‌చివేసింది. బారామ‌తిలో 8.45 గంట‌ల స‌మ‌యంలో లియ‌ర్‌జెట్‌45 కూలిపోవ‌డంతో అజిత్‌తో పాటు మ‌రో న‌లుగురు ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. అజిత్ ప‌వార్ ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీ, స‌హాయ‌కుడు, ఇద్ద‌రు పైల‌ట్లు ఉన్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement