త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Messi | కోల్‌కతా గడ్డపై సాకర్ మాంత్రికుడు

మెస్సీ కోల్‌కతాలో ల్యాండ్ కాగానే మెస్సీ.. మెస్సీ అనే నినాదం మారుమోగింది. మెస్సీకి జెండాలు ఊపుతూ ఫోన్ లైట్లతో ఘన స్వాగతం పలికారు. మెస్సీతో పాటు అతడి ఫ్రెండ్స్ లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ భారత్ టూర్‌కి వచ్చారు. అక్కడి నుంచి మెస్సీ హోటల్‌కు చేరుకున్నారు.

J

National | Published On Dec 13, 2025, 9.30 am IST

Messi | కోల్‌కతా గడ్డపై సాకర్ మాంత్రికుడు
Advertisement

Messi | అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత్‌లో అడుగుపెట్టాడు. తన గోట్ ఇండియా టూర్ కోసం శనివారం ఉదయం మెస్సీ కోల్‌కతాలో అడుగుపెట్టాడు. ఓ వైపు చలి వణికిస్తున్నా ఫుట్‌బాల్ దేవుడిని చూసేందుకు అభిమానులు ఎయిర్‌పోర్ట్ వద్ద ఎగబడ్డారు. వేలాదిమంది అభిమానులు కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కి చేరుకునేసరికి ఎయిర్‌పోర్ట్ దద్దరిల్లిపోయింది.

మెస్సీ.. మెస్సీ

మెస్సీ కోల్‌కతాలో ల్యాండ్ కాగానే మెస్సీ.. మెస్సీ అనే నినాదం మారుమోగింది. మెస్సీకి జెండాలు ఊపుతూ ఫోన్ లైట్లతో ఘన స్వాగతం పలికారు. మెస్సీతో పాటు అతడి ఫ్రెండ్స్ లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ భారత్ టూర్‌కి వచ్చారు. అక్కడి నుంచి మెస్సీ హోటల్‌కు చేరుకున్నారు.

మూడు రోజుల పర్యటన

గోట్ టూర్‌లో భాగంగా మెస్సీ మూడు రోజులు భారత్‌లో పర్యటించనున్నారు. కోల్‌కతాతో పాటు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో ఆయన పర్యటన ఉండనుంది. పర్యటనలో భాగంగా ఆయా రాష్ట్రాల సీఎంలు, ఇండస్ట్రియలిస్టులు, సినిమా ప్రముఖులను మెస్సీ కలవనున్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న మెస్సీ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నాడు. ఆ తర్వాత సోమవారం ప్రధాని మోదీని మెస్సీ కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement