త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

West Bengal Elections | బెంగాల్‌లో ఏం జ‌రుగుతోంది?.. ఈసీ సాయంతో ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేస్తున్న బీజేపీ: టీఎంసీ

West Bengal Elections | పశ్చిమ బెంగాల్‌లో (West Bengal Elections) ఈసారి అధికార మార్పిడి ప‌క్కా అన్ని మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్ జోస్యం చెప్పాయి. టీఎంసీ (TMC) అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీతో ఢీ అంటే ఢీ అన్న బీజేపీ (BJP,) సీఎం పీఠాన్ని ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశాయి.

G

National | Published On May 1, 2026, 6.33 am IST

West Bengal Elections | బెంగాల్‌లో ఏం జ‌రుగుతోంది?.. ఈసీ సాయంతో ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేస్తున్న బీజేపీ: టీఎంసీ
Advertisement

West Bengal Elections | త్రినేత్ర‌.న్యూస్‌: పశ్చిమ బెంగాల్‌లో (West Bengal Elections) ఈసారి అధికార మార్పిడి ప‌క్కా అన్ని మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్ జోస్యం చెప్పాయి. టీఎంసీ (TMC) అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీతో ఢీ అంటే ఢీ అన్న బీజేపీ (BJP,) సీఎం పీఠాన్ని ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశాయి. దీంతో ఆ పార్టీ వ‌ర్గాలు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. ఈ క్ర‌మంలో అంతా విస్తుపోయే ఓ వీడియోను తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) విడుద‌ల చేసింది. కోల్‌క‌తాలో ఈవీఎంలు భ‌ద్ర‌ప‌రిచిన స్ట్రాంగ్ రూమ్ (Strong Room) లోప‌ల కొంద‌రు వ్య‌క్తులు బ్యాలెట్ బాక్సులు (ballot boxes) తెరిచేందుకు ప్ర‌య‌త్నించార‌ని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ ఆరోపించింది. ఎలాగైనా ఎన్నిక‌ల్లో గెలిచేందుకు ఈసీ స‌హాయంతో బీజేపీ ఈ ప‌నికి ఒడిగ‌ట్టింద‌ని ధ్వ‌జ‌మెత్తింది. ఆ పార్టీ నేత‌లు స్ట్రాంగ్ రూమ్ ముందు ఆందోళ‌న‌కు దిగారు. ఎన్నిక‌లు ముగిసిన మ‌రుస‌టి రోజే ఈ హైడ్రామా చోటుచేసుకున్న‌ది.

ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత కోల్‌క‌తాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో బ్యాలెట్ బాక్సుల‌ను భ‌ద్ర‌ప‌రిచారు. ఏప్రిల్ 30న సాయంత్రం 5.55 గంట‌ల స‌మ‌యంలో స్ట్రాంగ్ రూమ్‌లోకి ప్ర‌వేశించిన కొంద‌రు వ్య‌క్తులు బ్యాలెట్ బాక్సులను తెరిచి ఏదో చేస్తున్నారు. ఇదంతా సీసీటీవీలో రికార్డ్ అయింది. ఈమేర‌కు ఓ వీడియోను టీఎంసీ విడుద‌ల చేసింది. టీఎంసీ నేతలు శశి పంజా, కునాల్ ఘోష్ స్ట్రాంగ్ రూమ్ ముందు ధర్నాకు దిగారు. తమ ప్రతినిధులు లేకుండానే బాక్సులు తెరిచేందుకు బీజేపీ, ఎన్నికల సంఘం అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. లోపల కొందరు వ్యక్తులు పని చేస్తున్నట్లు మాకు సీసీటీవీ కెమెరాల్లో కనిపించిందని, మమ్మల్ని లోపలికి అనుమతించడం లేదని వారు అన్నారు. అయితే టీఎంసీ ఆరోప‌ణ‌ల‌ను ఈసీ ఖండించింది.

అంత‌కుముందు, ఎగ్జిట్ పోల్స్ అంతా వట్టిదే. అవన్నీ బీజేపీ దిశానిర్దేశంతోనే నడుస్తున్నాయి. తాము 220కి పైగా సీట్లలో గెలువబోతున్నాం. అయితే, కౌంటింగ్‌లో బీజేపీ గందరగోళం సృష్టించే అవకాశం ఉంది. టీఎంసీ కార్యకర్తలు, నేతలు అప్రమత్తంగా ఉండాలి. అంటూ సీఎం మమతా బెనర్జీ ఓ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు.

 

Advertisement
Advertisement