ఢిల్లీలో మెస్సీ.. షేక్ హ్యాండ్కి కోటి
మెస్సీతో ఫోటో దిగాలంటే రూ.10 లక్షలు కట్టాలని ఇప్పటికే గోట్ టూర్ నిర్వాహకులు తెలిపిన విషయం తెలిసిందే. అది కూడా 100 మందికే అవకాశం ఇచ్చారు. తాజాగా ఢిల్లీలో కార్పొరేట్ ప్రముఖులు మెస్సీని కలిసేందుకు కోటి వరకు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది.
ఫుట్బాల్ మాంత్రికుడు, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మూడు రోజుల GOAT Tour లో భాగంగా డిసెంబర్ 15న ఢిల్లీలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకోనున్న మెస్సీకి స్వాగతం పలికేందుకు దేశ రాజధాని ముస్తాబైంది. మెస్సీ పర్యటన సందర్భంగా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
లీలా ప్యాలెస్లో బస
మెస్సీ, అతడి ఫ్రెండ్స్ ఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్న లీలా ప్యాలెస్ హోటల్లో బస చేయనున్నారు. మెస్సీ బృందం కోసం హోటల్లోని ఓ ఫ్లోర్ మొత్తం రిజర్వ్ చేసి ఉంచారు. ప్రెసిడెన్షియల్ సూట్లో మెస్సీ టీమ్ బస చేయనుంది. ఇందులో ఒక్క గది రెంట్ రోజుకు రూ.3.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.
ప్రైవేట్ మీట్ అండ్ గ్రీట్
ఇదే హోటల్లో కొందరు కార్పొరేట్ ప్రముఖులు, వీఐపీల కోసం ప్రైవేట్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మెస్సీ కలవాలంటే, అతడితో షేక్ హ్యాండ్ చేయాలంటే కోటి రూపాయలు వెచ్చించాలని తెలుస్తోంది.
మెస్సీతో ఫోటో దిగాలంటే రూ.10 లక్షలు కట్టాలని ఇప్పటికే గోట్ టూర్ నిర్వాహకులు తెలిపిన విషయం తెలిసిందే. అది కూడా 100 మందికే అవకాశం ఇచ్చారు. తాజాగా ఢిల్లీలో కార్పొరేట్ ప్రముఖులు మెస్సీని కలిసేందుకు కోటి వరకు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది.
ప్రధాని మోదీతో భేటీ
ఢిల్లీ పర్యటనలో భాగంగా మెస్సీ.. ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత పలువురు ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్, చీప్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రముఖులను మెస్సీ కలవనున్నారు. ఆ తర్వాత సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయం వెళ్లి అక్కడి నుంచి తన దేశానికి మెస్సీ తిరుగు ప్రయాణం కానున్నారు. డిసెంబర్ 15 తో మెస్సీ భారత్లో ది గోట్ టూర్ పూర్తవుతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Priyanka Gandhi | మోదీ ప్రభుత్వానికి చీకటి రోజు.. ఈ ఫలితం విపక్షాల ఐక్యతకు నిదర్శనం.. రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడంపై ప్రియాంక గాంధీ
ఏప్రిల్ 18, 2026

Air India | ఇరాన్తో యుద్ధం.. మే 31 వరకు ఇజ్రాయెల్కు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు
ఏప్రిల్ 6, 2026

Konda Vijay Kumar | ఢిల్లీ అధికారుల అదుపులో ‘కొండ’.. ఒంటిపై బంగారమంతా సీజ్
మార్చి 27, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



