త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dhatura | ఆన్‌లైన్‌లో ఉమ్మెత్త పండ్లు, విత్త‌నాలు.. అమెజాన్‌, స్విగ్గీ, బిగ్‌బాస్కెట్ లైసెన్సులు ర‌ద్దు

Dhatura | ప్ర‌ముఖ గ్రాస‌రీ, ఫుడ్ డెలివ‌రీ ప్లాట్‌ఫామ్‌లు అమెజాన్‌, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, బిగ్‌బాస్కెట్‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం (Karnataka) షాక్ఇచ్చింది. ఆన్‌లైన్‌లో విషపూరితమైన ఉమ్మెత్త (Dhatura) పండ్లు, విత్తనాలను ఆహార విభాగంలో అమ్మినందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కీలక చర్యలు తీసుకుంది.

G

National | Published On Aug 25, 2026, 8.59 am IST

Dhatura | ఆన్‌లైన్‌లో ఉమ్మెత్త పండ్లు, విత్త‌నాలు.. అమెజాన్‌, స్విగ్గీ, బిగ్‌బాస్కెట్ లైసెన్సులు ర‌ద్దు
Advertisement

Dhatura | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌ముఖ గ్రాస‌రీ, ఫుడ్ డెలివ‌రీ ప్లాట్‌ఫామ్‌లు అమెజాన్‌, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, బిగ్‌బాస్కెట్‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం (Karnataka) షాక్ఇచ్చింది. ఆన్‌లైన్‌లో విషపూరితమైన ఉమ్మెత్త (Dhatura) పండ్లు, విత్తనాలను ఆహార విభాగంలో అమ్మినందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కీలక చర్యలు తీసుకుంది. అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ ఫుడ్ లైసెన్సులను (Food Licence) తాత్కాలికంగా స‌స్పెండ్ (Suspended) చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇది కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. .

ఉమ్మెత్త పండ్లు, విత్తనాలు విషపూరితమైనవని తెలిసినప్పటికీ వాటిని మానవ వినియోగం కోసం ఆన్‌లైన్‌లో అమ్ముతున్న‌ట్లు ఫుడ్ సేఫ్టీ (FDA) అధికారులు గుర్తించారు. కొన్ని ప్యాకెట్లపై ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) ఫుడ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్లు కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. అంతేకాకుండా ఉమ్మెత్త ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ ఉంచి, ఆన్‌లైన్‌లో విక్రయించిన‌ట్లు అధికారులు గుర్తించారు.

ఉమ్మెత్త ఉత్పత్తుల విక్రయంపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఫుడ్ సేఫ్టీ శాఖ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా మూడు సంస్థల ప్రతినిధులు అధికారుల ముందు హాజరయ్యారు. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ మరిన్ని వివరాలు, తాము తీసుకున్న చర్యలకు సంబంధించిన పత్రాలను సమర్పించేందుకు అదనపు సమయం కోరింది. ఇప్పటికే ఉమ్మెత్త పండ్ల ఆన్‌లైన్ విక్రయాన్ని నిలిపివేసినట్లు బిగ్‌బాస్కెట్ తెలిపింది. భవిష్యత్తులో ఇటువంటి ఉత్పత్తులపై 'మానవ వినియోగానికి కాదు' అనే స్పష్టమైన లేబులింగ్ చేస్తామని వెల్ల‌డించింది. అమెజాన్ ఈ వ్యవహారంపై తన స్పందనను ఇంకా సమర్పించలేదని అధికారులు తెలిపారు.

 

Advertisement
Advertisement