త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్ర‌హం.. ప్ర‌జారోగ్యంపై పట్టింపు లేద‌ని విమ‌ర్శ‌లు..

Supreme Court | ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై హెచ్చరిక లేబుల్స్‌ ప్రవేశపెట్టడంలో జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్యాకేజ్డ్ ఆహారాలపై హెచ్చరిక లేబుల్స్‌ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నిస్తూ.. ప్రభుత్వానికి తమ‌ ప్రజల‌ ఆరోగ్యం అంటే ప‌ట్టింపు లేదా ? అని సుప్రీంకోర్టు ఘాటుగా ప్రశ్నించింది.

S

Lifestyle | Published On Aug 14, 2026, 3.27 pm IST

Supreme Court | ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్ర‌హం.. ప్ర‌జారోగ్యంపై పట్టింపు లేద‌ని విమ‌ర్శ‌లు..
Advertisement

Supreme Court | ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై హెచ్చరిక లేబుల్స్‌ ప్రవేశపెట్టడంలో జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్యాకేజ్డ్ ఆహారాలపై హెచ్చరిక లేబుల్స్‌ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నిస్తూ.. ప్రభుత్వానికి తమ‌ ప్రజల‌ ఆరోగ్యం అంటే ప‌ట్టింపు లేదా ? అని సుప్రీంకోర్టు ఘాటుగా ప్రశ్నించింది. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై తప్పనిసరిగా ఫ్రంట్-ఆఫ్-ప్యాకేజ్ వార్నింగ్ లేబుల్స్‌ (ఎఫ్‌ఓపీఎల్‌) ఏర్పాటు చేయాలని కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించాలని కోరుతూ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ 3ఎస్ అండ్ అవర్ హెల్త్ సొసైటీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

చ‌ర్య‌లు తీసుకుంటారా, ఆదేశాలు జారీ చేయాలా..

జస్టిస్ జె.బి. పర్దీవాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లల్లో అవగాహన కల్పించేందుకు ఎఫ్‌ఓపీఎల్‌ లేబుల్స్‌ ఎంతో అవసరమని పేర్కొంది. పిల్లలు జంక్ ఫుడ్‌కు అలవాటుపడుతున్న నేపథ్యంలో, ఆహార పదార్థాల్లోని అనారోగ్యకరమైన పదార్థాలపై స్పష్టమైన హెచ్చరికలు ఉండాల్సిన అవసరం ఉందని తెలిపింది. అదనపు సొలిసిటర్ జనరల్ బృజేందర్ చాహర్‌ను ఉద్దేశించి జస్టిస్ పర్దీవాలా మాట్లాడుతూ.. మీరు కోర్టును ఆటపట్టిస్తున్నారా? అని ప్రశ్నించారు. లేబులింగ్ అంశంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదని అత్యున్నత న్యాయస్థానం గుర్తించింది. తాము ఈ పని ప్రజా ప్రయోజనం కోసం చేస్తున్నామ‌ని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల‌ని, త‌మ‌ కోసం తాము ఇలా చేయడం లేదని తెలిపారు.త‌మ‌ ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వంపై ఉన్న‌ ఒత్తిడి త‌మ‌కు తెలుస‌ని, స్వయంగా దీనిపై చర్యలు తీసుకుంటారా? లేక తామే ఒక ఆదేశం జారీ చేయాలా? అని జస్టిస్ పర్దీవాలా పేర్కొన్నారు.

అధిక‌మ‌వుతున్న జీవ‌న‌శైలి వ్యాధులు..

దేశంలో పెరుగుతున్న వ్యాధుల భారాన్ని కూడా ఈ పిటిషన్ ప్రస్తావించింది. ప్యాకేజ్డ్ ఆహారాలపై ఎఫ్‌ఓపీఎల్‌ లేబుల్స్‌ ఉంటే అధిక స్థాయిలో ఉండే చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వుల గురించి వినియోగదారులకు స్పష్టమైన సమాచారం అందుతుందని పిటిషన్ పేర్కొంది. ఇవే మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ల వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయని వివరించింది. దేశవ్యాప్తంగా జీవనశైలి సంబంధిత వ్యాధులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంటువ్యాధులు కాని వ్యాధుల కారణంగా దేశంలో ప్రతి ఏడాది 60 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. ముఖ్యంగా మధుమేహం నిశ్శబ్ద మహమ్మారిగా మారుతోందని, దేశంలో దాదాపు ప్రతి నలుగురిలో ఒకరిని ఈ వ్యాధి ప్రభావితం చేస్తోందని పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement