త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

K Annamalai | బీజేపీకి ‘సింగం’ గుడ్‌బై? కొత్త పార్టీ దిశగా అన్నామలై అడుగులు.. అసలేం జరుగుతోంది?

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం! బీజేపీకి గుడ్‌బై చెప్పి సొంత కుంపటి పెట్టుకునే దిశగా ఫైర్‌బ్రాండ్ లీడర్ అన్నామలై అడుగులు. అసలేం జరుగుతోందంటే?

J

National | Published On Jun 1, 2026, 7.25 pm IST

K Annamalai | బీజేపీకి ‘సింగం’ గుడ్‌బై? కొత్త పార్టీ దిశగా అన్నామలై అడుగులు.. అసలేం జరుగుతోంది?
Advertisement

K Annamalai | త్రినేత్ర.న్యూస్ : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోందా? ఫైర్‌బ్రాండ్ లీడర్, మాజీ ఐపీఎస్ (IPS) అధికారి కె. అన్నామలై (K Annamalai) బీజేపీకి గుడ్‌బై చెప్పబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి తాజా రాజకీయ వర్గాలు. పార్టీలో తనకు తగిన గుర్తింపు, భవిష్యత్తు లేదని భావిస్తున్న ఆయన.. త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తో ఢిల్లీలో సమావేశమై తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కారుపై జెండా మాయం.. రాజ్యసభ సీటుకు నో!

ఇటీవల జరిగిన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) బీజేపీ కేవలం ఒకే ఒక్క స్థానానికే పరిమితమైంది. దీనికి తోడు, పార్టీ అధిష్టానం ఆఫర్ చేసిన రాజ్యసభ సీటును కూడా అన్నామలై సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. తాజాగా ఆయన ఢిల్లీ వెళ్లేందుకు చెన్నై ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పుడు, ఆయన కారుపై బీజేపీ జెండా లేకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. మీడియాతో మాట్లాడుతూ.. "రెండ్రోజులు ఆగండి.. అప్పుడు కూర్చుని మాట్లాడుకుందాం" అని మాత్రమే బదులిచ్చారు.

ఉద్యమం నుంచి.. రాజకీయ పార్టీగా!

అన్నామలై ముందుగా భావసారూప్యత గల వ్యక్తులతో ఒక సామాజిక ఉద్యమాన్ని ప్రారంభించి, ఆ తర్వాత రాజకీయ పార్టీగా మార్చే యోచనలో ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన "వి ద లీడర్స్" (We The Leaders) అనే పేరుతో ఒక నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌ను నడుపుతున్నారు. దీనికి తోడు ఆయన అభిమానులు "అన్నామలై అన్బు కూట్టం" పేరుతో వాలంటీర్ల (Volunteers) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేశారు. జూన్ 4న ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని కోయంబత్తూర్ అంతటా వెలసిన భారీ పోస్టర్లు.. కొత్త పార్టీ రాకను పరోక్షంగా సూచిస్తున్నాయి.

K Annamalai to Quit BJP and Launch New Party in Tamil Nadu?

కేంద్రంతో విభేదాలు.. అన్నాడీఎంకేతో అగాథం

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో అన్నామలైకి ఇటీవల కాలంలో బహిరంగంగానే అభిప్రాయభేదాలు వచ్చాయి. ముఖ్యంగా సీబీఎస్‌ఈ (CBSE) 9వ తరగతి విద్యార్థులకు 2026 జులై నుంచే త్రిభాషా విధానాన్ని (Three-language policy) తప్పనిసరి చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దీనివల్ల విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పడుతుందని, 2029-30 నుంచి అమలు చేయాలన్న పాత నిర్ణయానికే కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.

మరోవైపు, అన్నాడీఎంకే (AIADMK) తో బీజేపీ పొత్తు వ్యవహారం కూడా అన్నామలైకి ఏమాత్రం ఇష్టం లేదు. తమిళనాడులో బీజేపీ ఒంటరి పోరు చేయాలని ఆయన గట్టిగా వాదించినా, అధిష్ఠానం మాత్రం పొత్తుకే సై అంది. అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి డిమాండ్ మేరకే అన్నామలైని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. ఈ కారణాల వల్లే ఆయన 2026 ఎన్నికల్లో పోటీ చేయలేదు, ప్రచారంలోనూ యాక్టివ్‌గా పాల్గొనలేదు.

పొలిటికల్ హీట్ పెంచుతున్న ట్వీట్లు

అన్నామలై రెండు కీలకమైన స్టేట్ కమిటీ మీటింగ్స్‌కి డుమ్మా కొట్టడం, అదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం (Karti Chidambaram) తన ఎక్స్ ఖాతాలో "తమిళనాడులో మరో కొత్త పార్టీ రాబోతోంది" అని ట్వీట్ చేయడంతో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగింది. సివిల్ సర్వీసెస్‌ను వదిలేసి, ప్రధాని మోదీ స్ఫూర్తితో 2020లో బీజేపీలో చేరిన ఈ 'సింగం' (Singham) ఇప్పుడు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement