త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

One India-One Nation | ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అమ‌లుకు కేంద్రం క‌స‌ర‌త్తు

One India-One Nation | దేశంలో ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానాన్ని అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు రెండు దశల ప్రణాళికపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చ‌ర్చిస్తున్న‌ది.

P

National | Published On Jun 2, 2026, 3.54 pm IST

One India-One Nation | ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అమ‌లుకు కేంద్రం క‌స‌ర‌త్తు
Advertisement
  • నివేదిక స‌మ‌ర్పించిన రామ్‌నాథ్ కోవింద్ క‌మిటీ
  • ప‌రిశీలిస్తున్న జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీ
  • పార్ల‌మెంట్ మాన్‌సూన్ స‌మావేశాల్లో చ‌ర్చించే ఛాన్స్‌

One India-One Nation | దేశంలో ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానాన్ని అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు రెండు దశల ప్రణాళికపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చ‌ర్చిస్తున్న‌ది. 2029లో తొలి దశను ప్రారంభించి, 2034 నాటికి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో జమిలి ఎన్నికలు నిర్వహించాలన్నదే ల‌క్ష్యంగా నిర్దేశించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు దాదాపు 20 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించే అవ‌కాశం ఉన్న‌ది. ఇందుకోసం కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాన్ని స్వల్పంగా పెంచడం, మరికొన్నింటిని తగ్గించడం ద్వారా ఎన్నికల షెడ్యూల్‌ను సమన్వయం చేయాలని భావిస్తోంది. 2028 ఎల‌క్ట్రోర‌ల్ సైకిల్‌లో ఉన్న తెలంగాణ, క‌ర్నాట‌క, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల అసెంబ్లీల గడువు పొడిగించే అవకాశం ఉండగా, బిహార్‌, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో పదవీకాలం కుదించే అవ‌కాశం ఉన్న‌ది.

అయితే, ఆంధ్రప్రదేశ్‌తో పాటు 2029 సైకిల్‌లో ఉన్న ఉన్న రాష్ట్రాలపై పెద్ద‌గా ప్ర‌భావం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని భావిస్తున్నారు. జమిలి ఎన్నికలకు రాజ్యాంగపరమైన వెసులుబాటు ఉన్నప్పటికీ, చట్టసవరణలతో పాటు రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నికల ఖర్చులు, పరిపాలనా భారం తగ్గుతాయని అనుకూల వర్గాలు వాదిస్తుండగా.. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి, ప్రజా తీర్పుపై ప్రభావం పడే ప్రమాదం ఉందని విమర్శకులు అభిప్రాయం వ్య‌క్తం చేశారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని క‌మిటీ ఇప్ప‌టికే నివేదిక‌ను స‌మ‌ర్పించిన విష‌జ్ఞం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ నివేదిక‌ను ప‌రిశీలిస్తున్న జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీ.. ఈ ఏడాది జ‌రిగే పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశం వ‌ర‌కు తుది నివేదిక‌ను ఇవ్వ‌నుంది. అనంతరం ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరిగే అవకాశం ఉన్న‌ది.

Advertisement

తాజావార్తలు

Advertisement