త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

దేశవ్యాప్తంగా 6117 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై

ప్రతి స్టేషన్‌లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే 1731 రైల్వే స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఫిక్స్ చేసింది. 11953 కోచ్‌లను ప్రయాణికులను ఎలాంటి అసౌకర్యం లేకుండా భద్రతతో కూడిన ప్రయాణం చేసేలా రైల్వే శాఖ చర్యలు తీసుకుంది.

J

National | Published On Dec 17, 2025, 7.27 pm IST

దేశవ్యాప్తంగా 6117 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై
Advertisement

ఈరోజుల్లో రైలు ప్రయాణాలు చేయాలన్నా ఆన్‌లైన్‌లో టికెట్ తీసుకొని బయలుదేరవచ్చు. స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. టికెట్ల కోసం గంటలకు గంటలు టికెట్ బుకింగ్ దగ్గర వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దేశంలో ప్రతిదీ డిజిటలైజేషన్ చేస్తున్నామని, ఈ డిజిటలైజేషన్‌కి ప్రజలు కూడా మద్దతు పలకాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫైని కేంద్రం అందిస్తోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ విషయాలను వెల్లడించారు.

దేశవ్యాప్తంగా 6117 రైల్వే స్టేషన్లలో ప్రస్తుతం ఫ్రీ వైఫైని అందిస్తున్నారు. దాని కోసం ప్రత్యేకంగా రైల్వే మంత్రిత్వ శాఖ నిధులేమీ కేటాయించలేదు. ఈ వైఫై సర్వీసును వినియోగించుకోవాలంటే దాని కోసం వ్యక్తిగత డేటా ఏదీ ఇవ్వాల్సిన పని లేకుండా మొబైల్ నెంబర్, దానికి వచ్చే ఓటీపీ ఎంటర్ చేస్తే వైఫైని ఉచితంగా వాడుకునేలా సులభంగా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసుకునేలా కేంద్రం సులభతరం చేసింది.

1731 స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు

అలాగే, ప్రతి స్టేషన్‌లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే 1731 రైల్వే స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఫిక్స్ చేసింది. 11953 కోచ్‌లను ప్రయాణికులను ఎలాంటి అసౌకర్యం లేకుండా భద్రతతో కూడిన ప్రయాణం చేసేలా రైల్వే శాఖ చర్యలు తీసుకుంది.

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో 250 సీసీటీవీ కెమెరాలు

ఢిల్లీ రైల్వే ష్టేషన్‌లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ వద్ద బయటి వైపు ఉన్న ప్రాంతాలు కవర్ అయ్యేలా సీసీటీవీ కెమెరాలను అమర్చారు. అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ప్లాట్‌ఫామ్స్, వెయిటింగ్ హాల్స్, టికెట్ కౌంటర్స్ పూర్తి స్థాయిలో కనిపించేలా కెమెరాలను అమర్చారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఫిబ్రవరి 15, 2025 తర్వాత కొన్ని ఏరియాలను పునర్నిర్మించారు. ఆ కొత్త ప్రాంతాల్లో అదనంగా సీసీటీవీ కెమెరాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తంగా ఒక్క ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోనే ఇప్పటి వరకు 250 సీసీటీవీ కెమెరాలను అమర్చారని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement