Odesa Port Attack | ఉక్రెయిన్ రాయబారికి భారత్ సమన్లు
Odesa Port Attack | నల్ల సముద్ర ప్రాంతంలో భారతీయ నావికుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్లోని ఒడెస్సా పోర్ట్లో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఎంవీ ఏజీఎన్ రాగ్నార్ కార్గో నౌకపై జరిగిన దాడి నేపథ్యంలో సోమవారం ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెక్సాండర్ పోలిష్చుక్ను విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసి వివరణ కోరింది.
- నల్ల సముద్రంలో నావికుల భద్రతపై కేంద్రం ఆందోళన
- ఇద్దరు భారతీయుల కోసం గాలింపు
Odesa Port Attack | నల్ల సముద్ర ప్రాంతంలో భారతీయ నావికుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్లోని ఒడెస్సా పోర్ట్లో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఎంవీ ఏజీఎన్ రాగ్నార్ కార్గో నౌకపై జరిగిన దాడి నేపథ్యంలో సోమవారం ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెక్సాండర్ పోలిష్చుక్ను విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసి వివరణ కోరింది. శనివారం జరిగిన ఈ దాడి సమయంలో నౌకలో నలుగురు భారతీయ నావికులు ఉన్నారు. వారిలో ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించగా.. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. ఘర్షణ ప్రాంతాల్లో పనిచేస్తున్న భారతీయుల భద్రతకే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
ఈ ఘటన నేపథ్యంలో ఆదివారం విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. యుద్ధ ప్రభావిత సముద్ర ప్రాంతాల్లో ప్రయాణించే వాణిజ్య నౌకల్లో ఉద్యోగాలకు వెళ్లే ముందు భద్రతాపరమైన ప్రమాదాలను పూర్తిగా అంచనా వేసుకోవాలని భారతీయులకు సూచించింది. అలాంటి ప్రాంతాల్లో పనిచేస్తున్న నావికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గత వారం ఎంవీ గోల్డెన్ లియో వాణిజ్య నౌకపై రష్యా జరిపిన దాడిలో నలుగురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనపై కూడా కేంద్రం రష్యా తాత్కాలిక రాయబారి వ్లాదిమిర్ లదనోవ్ను పిలిపించి నిరసన తెలిపింది. జూలై 18 నుంచి ఇప్పటివరకు నల్ల సముద్ర ప్రాంతంలో జరిగిన దాడుల్లో మొత్తం ఐదుగురు భారతీయ నావికులు మృతిచెందారు. వారం రోజుల్లో భారతీయ సిబ్బందితో ఉన్న నౌకలపై మూడు తీవ్రమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే, భారతీయుల భద్రత విషయంలో రాజీపడబోమని కేంద్రం ఉక్రెయిన్, రష్యా ప్రభుత్వాలకు స్పష్టమైన సంకేతాలను పంపింది. సంబంధిత దేశాల అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
జులై 26, 2026

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
జులై 26, 2026

CWG 2026 | గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్.. వెయిట్లిఫ్ట్లో భారత్కు సిల్వర్..!
జులై 26, 2026
తాజావార్తలు
- ●MP Lakshman | రేవంత్ను ఒక్కటే అడుగుతున్నా.. రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయ్?
- ●Bhatti Vikramarka | ఉచిత పథకాలు కాదు.. ప్రజల భవిష్యత్పై పెట్టుబడులు అవి
- ●Kangana Ranaut | ఎగ్జామ్స్ బిల్లుపై రగడ: విపక్షాలపై కంగనా రనౌత్ ఫైర్.. రాహుల్ గాంధీకి స్ట్రాంగ్ కౌంటర్!
- ●MP Chamala Kirankumar Reddy | 21 ఏళ్లకే చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి.. ఎంపీ చామల డిమాండ్
- ●Supreme Court | మతం మారితే ఎస్సీ హోదా వర్తించదు.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ
- ●Sukanya Samriddhi Yojana | కేవలం వడ్డీ ద్వారానే రూ.50 లక్షలు పొందవచ్చు.. పోస్టాఫీస్లో అద్భుతమైన పథకం..

MP Lakshman | రేవంత్ను ఒక్కటే అడుగుతున్నా.. రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయ్?

Bhatti Vikramarka | ఉచిత పథకాలు కాదు.. ప్రజల భవిష్యత్పై పెట్టుబడులు అవి

Kangana Ranaut | ఎగ్జామ్స్ బిల్లుపై రగడ: విపక్షాలపై కంగనా రనౌత్ ఫైర్.. రాహుల్ గాంధీకి స్ట్రాంగ్ కౌంటర్!

MP Chamala Kirankumar Reddy | 21 ఏళ్లకే చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి.. ఎంపీ చామల డిమాండ్



