త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Earthquake | విశాఖ నగరంలో భూ ప్రకంపనలు.. ఉలిక్కిప‌డ్డ ప్ర‌జ‌లు

Earthquake | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ‌ప‌ట్ట‌ణం( Vishakapattanam ) సిటీలో స్వ‌ల్ప భూప్రకంప‌న‌లు సంభ‌వించాయి. దీంతో నిద్ర‌లోనే విశాఖ వాసులు ఉలిక్కిప‌డ్డారు.

S

National | Published On Jul 12, 2026, 7.16 am IST

Earthquake | విశాఖ నగరంలో భూ ప్రకంపనలు.. ఉలిక్కిప‌డ్డ ప్ర‌జ‌లు
Advertisement

Earthquake | త్రినేత్ర‌.న్యూస్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ‌ప‌ట్ట‌ణం( Vishakapattanam ) సిటీలో స్వ‌ల్ప భూప్రకంప‌న‌లు సంభ‌వించాయి. దీంతో నిద్ర‌లోనే విశాఖ వాసులు ఉలిక్కిప‌డ్డారు. ఆదివారం తెల్ల‌వారుజామున 5.08 గంట‌ల‌కు వైజాగ్‌( Vizag )లోని ప‌లు ప్రాంతాల్లో భూమి కంపించింది. స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురై త‌మ నివాసాల నుంచి నిద్ర మ‌త్తులోనే బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. మంగమారిపేట, మధురవాడ, జగదాంబ సహా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభ‌వించ‌గా, రిక్ట‌ర్ స్కేలుపై భూకంపం తీవ్రత 4.5 గా నమోదు అయింది. కాకినాడకు 225 కి.మీ దూరంలో బంగాళాఖాతంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

Advertisement
Advertisement