త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Earthquake | నాందేడ్‌లో స్వ‌ల్ప భూప్ర‌కంప‌న‌లు.. తెలంగాణ‌లోని ఆ జిల్లాల్లో కంపించిన భూమి

Earthquake | మ‌హారాష్ట్ర‌లోని హింగోలి - నాందేడ్ రీజియ‌న్‌లోని గురువారం తెల్ల‌వారుజామున స్వ‌ల్పంగా భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లోని నిర్మ‌ల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, జ‌గిత్యాల జిల్లాల్లో స్వ‌ల్పంగా భూమి కంపించింది.

S

Telangana | Published On Jul 9, 2026, 1.47 pm IST

Earthquake | నాందేడ్‌లో స్వ‌ల్ప భూప్ర‌కంప‌న‌లు.. తెలంగాణ‌లోని ఆ జిల్లాల్లో కంపించిన భూమి
Advertisement

Earthquake | త్రినేత్ర‌.న్యూస్ : మ‌హారాష్ట్ర‌లోని హింగోలి - నాందేడ్ రీజియ‌న్‌లోని గురువారం తెల్ల‌వారుజామున స్వ‌ల్పంగా భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లోని నిర్మ‌ల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, జ‌గిత్యాల జిల్లాల్లో స్వ‌ల్పంగా భూమి కంపించింది.

నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మాల‌జీ అధికారుల ప్ర‌కారం.. హింగోలి - నాందేడ్ రీజియ‌న్‌లో గురువారం తెల్ల‌వారుజామున 1.40 గంట‌ల‌కు స్వ‌ల్ప భూప్ర‌కంన‌లు సంభ‌వించాయ‌ని తెలిపారు. రిక్ట‌ర్ స్కేలుపై భూకంప తీవ్ర‌త 4.6గా న‌మోదైంద‌ని పేర్కొన్నారు. త‌ద‌నంత‌రం వ‌రుస‌గా మూడు సార్లు భూమి కంపించింద‌ని, రిక్ట‌ర్ స్కేలుపై 3.6, 3.9, 4.1గా తీవ్ర న‌మోదైంది. హింగోలి - నాందేడ్ ఏరియాలో భూకంపం కేంద్రీకృతం కాగా, నిర్మ‌ల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, జ‌గిత్యాల జిల్లాల్లో స్వ‌ల్పంగా భూమి కంపించింద‌ని తెలిపారు.

అయితే భూకంపం కార‌ణంగా ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం సంభ‌వించ‌లేదు. స్వ‌ల్పంగా భూమి కంపించ‌డంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురై త‌మ నివాసాల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. రాత్రంతా ప‌లువురు నిద్ర పోకుండా ప‌డిగాపులు కాచారు.

Advertisement
Advertisement