త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dharmendra Pradhan | కాక్రోచ్‌ల‌కు తలొగ్గిన కేంద్రం.. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా

Dharmendra Pradhan | ఎట్ట‌కేల‌కు కాక్రోచ్‌ల దండుకు కేంద్రం త‌లొగ్గింది. మొత్తానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్(Dharmendra Pradhan )రాజీనామా చేశారు.

S

National | Published On Jul 25, 2026, 2.34 pm IST

Dharmendra Pradhan | కాక్రోచ్‌ల‌కు తలొగ్గిన కేంద్రం.. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా
Advertisement

Dharmendra Pradhan | త్రినేత్ర‌.న్యూస్ : ఎట్ట‌కేల‌కు కాక్రోచ్‌ల దండుకు కేంద్రం త‌లొగ్గింది. మొత్తానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్(Dharmendra Pradhan )రాజీనామా చేశారు. నీట్( NEET ) పేప‌ర్ లీకేజీకి బాధ్య‌త వ‌హిస్తూ ప్ర‌ధాన్ త‌న రాజీనామా లేఖ‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి అంద‌జేశారు. ఈ సందర్భంగా ప్రధాన్‌ స్పందిస్తూ.. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నట్లు చెప్పారు.

గ‌త ప‌ది రోజులుగా చోటు చేసుకుంటున్న ఘ‌ట‌న‌లు త‌న‌ను ఎంతో బాధించాయి. ఇది త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ఠ‌కు సంబంధించిన విష‌యం కాదు. యువ‌శ‌క్తే.. ఈ దేశ అస‌లైన శ‌క్తి. విద్యార్థుల భ‌విష్య‌త్ కోస‌మే రాజీనామా చేశాను. ఇక విద్యార్థులు త‌మ స‌మ‌యాన్ని వృథా కానివ్వ‌కుండా చ‌దువుల‌కు కేటాయించాలి. మంత్రిగా ఇన్నాళ్లు త‌న‌కు అవ‌కాశం క‌ల్పించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అని ప్ర‌ధాన త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement