త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CWC Meeting New Delhi | ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ: ఆ రెండు అస్త్రాలతో కేంద్రంపై పోరుకు మాస్టర్ ప్లాన్.. రేవంత్ హాజరు

ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ భేటీ ప్రారంభమైంది. నీట్ ఇష్యూ, రామాలయ విరాళాల వ్యవహారంపై కేంద్రంపై పోరాటమే లక్ష్యంగా కాంగ్రెస్ కీలక వ్యూహాలు రచిస్తోంది.

J

National | Published On Aug 19, 2026, 6.55 pm IST

CWC Meeting New Delhi | ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ: ఆ రెండు అస్త్రాలతో కేంద్రంపై పోరుకు మాస్టర్ ప్లాన్.. రేవంత్ హాజరు
Advertisement
  • న్యూఢిల్లీలో మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సీడబ్ల్యూసీ (CWC) సమావేశం
  • సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు
  • నీట్ పేపర్ లీక్, అయోధ్య రామాలయ విరాళాల వ్యవహారమే ప్రధాన అస్త్రాలుగా కేంద్రంపై పోరాటానికి ప్లాన్
  • వచ్చే ఏడాది 7 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై సుదీర్ఘ చర్చ

CWC Meeting New Delhi | త్రినేత్ర.న్యూస్ : దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) బుధవారం నాడు అత్యంత కీలక సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంతో పాటు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేయడమే ఈ మీటింగ్ (Meeting) మెయిన్ అజెండాగా తెలుస్తోంది.

CWC Meeting in Delhi Congress Masterplan for Upcoming Assembly Elections

కేంద్రంపై ఆ రెండు అస్త్రాలు..

కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రధానంగా రెండు అంశాలను కాంగ్రెస్ రాజకీయ అస్త్రాలుగా మలచుకోనుంది. అందులో మొదటిది 'నీట్ (NEET) పేపర్ లీక్'. విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు కాంగ్రెస్ ఇప్పటికే మద్దతుగా నిలిచింది. ఇటీవల ఛలో పార్లమెంట్ ర్యాలీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌పై ఉభయ సభల్లోనూ ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్షం గట్టిగా నిలదీసింది. ఇప్పుడు ఇదే ఇష్యూను జనాల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని CWC డిసైడ్ అయ్యింది.

CWC Meeting in Delhi Congress Masterplan for Upcoming Assembly Elections

దీనికి తోడు.. 'అయోధ్య రామ మందిర విరాళాల' వ్యవహారంలో వస్తున్న ఆరోపణలపైనా పోరాట కార్యాచరణకు (Action plan) ఈ సమావేశంలో రూపకల్పన చేశారు.

CWC Meeting in Delhi Congress Masterplan for Upcoming Assembly Elections

వచ్చే ఏడాది 7 రాష్ట్రాల ఎన్నికలే టార్గెట్

మరోవైపు, వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, గుజరాత్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై సీనియర్ నేతలు చర్చించారు. ఇటీవలి ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా.. ఈ 7 రాష్ట్రాల్లో అనుసరించాల్సిన లాంగ్-టర్మ్ స్ట్రాటజీని (Long-term strategy) ఖరారు చేశారు.

CWC Meeting in Delhi Congress Masterplan for Upcoming Assembly Elections

హాజరైన కీలక నేతలు వీరే..

ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం వీడీ సతీశన్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కుతో పాటు సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, పి.చిదంబరం, దిగ్విజయ్ సింగ్, సచిన్ పైలట్ తదితరులు పాల్గొన్నారు.

CWC Meeting in Delhi Congress Masterplan for Upcoming Assembly Elections CWC Meeting in Delhi Congress Masterplan for Upcoming Assembly Elections CWC Meeting in Delhi Congress Masterplan for Upcoming Assembly Elections CWC Meeting in Delhi Congress Masterplan for Upcoming Assembly Elections

Advertisement
Advertisement