Couple Divorce | 2 ఏళ్లు సహజీవనం చేశారు.. పెళ్లయిన 24 గంటల్లో విడాకులు తీసుకున్నారు!
పెళ్లి అయిన వెంటనే ఒకరిని విడిచి మరొకరు ఉండటం కరెక్ట్ కాదని, ఇలాంటి పరిస్థితుల్లో విడాకులే బెస్ట్ ఆప్షన్ అని ఆ జంట భావించిందట. కోర్టు కూడా ఈ కేసుపై వెంటనే రెస్పాండ్ అయి విడాకులు ఇచ్చింది.
Couple Divorce | ఓ జంట రెండేళ్ల పాటు సహజీవనం చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న 24 గంటల్లో ఆ నవ వధూవరులు విడాకులు కూడా తీసేసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది. పెళ్లి కాగానే వాళ్ల మధ్య మనస్పర్థలు రావడంతో వెంటనే విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకొని లాయర్ని సంప్రదించారు. ఇది ఒక అసాధారణమైన కేసు అని ఆ జంట విడాకుల కేసును వాదించిన లాయర్ చెప్పుకొచ్చారు.
భర్త ఇంజినీర్, భార్య డాక్టర్. పెళ్లి కాగానే వాళ్ల జీవన విధానంపై ఒక క్లారిటీకి రాలేకపోయారు. ఇద్దరి మధ్య సైద్ధాంతిక విభేదాలు వచ్చాయని, అందుకే కాలయాపన చేయకుండా వెంటనే విడాకులు తీసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు అడ్వకేట్ రాణి సోనావానె తెలిపారు.
ఈ సమయంలో ఇద్దరి మధ్య ఎలాంటి హింస చోటు చేసుకోలేదు. ఎలాంటి నేరానికి పాల్పడలేదు. ఇద్దరూ సంయమనం పాటించారు. ఇద్దరిదీ ప్రేమ వివాహం అయినా వాళ్ల విడాకుల ప్రక్రియను చట్టప్రకారంగా తీసుకెళ్లాలని అనుకున్నారు. అందుకే ఇద్దరూ విడాకుల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారని అడ్వకేట్ అన్నారు.
షిప్లో పని చేసేందుకు వెళ్తున్నందుకేనా?
పెళ్లి కాగానే.. తాను ఓ షిప్లో పని చేసేందుకు వెళ్తున్నానని, ఎన్ని రోజులు వదిలి వెళ్లాలో, తిరిగి ఎప్పుడు వస్తానో కూడా తన భర్త చెప్పకపోవడం వల్లనే భార్యకు తన భర్త తనను వదిలి వెళ్లడం ఇష్టం లేక విడాకులు తీసుకుందామని చెప్పడంతో ఇద్దరూ దానికి అంగీకరించారని అడ్వకేట్ రాణి అన్నారు.
పెళ్లి అయిన వెంటనే ఒకరిని విడిచి మరొకరు ఉండటం కరెక్ట్ కాదని, ఇలాంటి పరిస్థితుల్లో విడాకులే బెస్ట్ ఆప్షన్ అని ఆ జంట భావించిందట. కోర్టు కూడా ఈ కేసుపై వెంటనే రెస్పాండ్ అయి విడాకులు ఇచ్చింది. ఇలాంటి కేసులలో సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం వాళ్లకు వెంటనే విడాకులు మంజూరు చేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Palghar Road Accident | మహారాష్ట్రలో నెత్తురోడిన హైవే.. నిశ్చితార్థానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 11 మంది మృతి
మే 18, 2026

Jayam Ravi | బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది – నాపై చేతబడి చేయించింది – భార్యపై కోలీవుడ్ హీరో ఆరోపణలు
మే 16, 2026

Seaweed Farming | చేపలు లేవని బాధ లేదు.. సముద్రంలోనే కొత్త వ్యవసాయం: మత్స్యకారుల తలరాత మారుస్తున్న ‘సీవీడ్’ సాగు!
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



