త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CJP protest Delhi | ఢిల్లీలో సెప్టెంబర్ 5 నిరసన క్యాన్సిల్.. సుప్రీంకోర్టులో కేంద్రం కీలక ప్రకటనతో సీజేపీ వెనక్కి

విద్యార్థులపై నమోదైన కేసులను కొట్టివేసేందుకు కేంద్రం అంగీకరించడంతో సెప్టెంబర్ 5న ఢిల్లీలో తలపెట్టిన నిరసనను విరమించుకుంటున్నట్లు CJP సుప్రీంకోర్టుకు తెలిపింది.

J

National | Published On Sep 1, 2026, 3.08 pm IST

CJP protest Delhi | ఢిల్లీలో సెప్టెంబర్ 5 నిరసన క్యాన్సిల్.. సుప్రీంకోర్టులో కేంద్రం కీలక ప్రకటనతో సీజేపీ వెనక్కి

సంక్షిప్త సారాంశం

దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)లను రద్దు చేసేందుకు కేంద్రం సుప్రీంకోర్టులో అంగీకరించింది. 'పేపర్ లీక్' బాధితులకు మూడు నెలల్లో పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేంద్రం సానుకూల నిర్ణయంతో సెప్టెంబర్ 5న ఢిల్లీలో జరగాల్సిన నిరసన మార్చ్‌ను CJP విరమించుకుంది. ప్రభుత్వం, విద్యార్థి సంఘాలు సానుకూలంగా స్పందించడంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

CJP protest Delhi | త్రినేత్ర.న్యూస్ : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసులను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం సుప్రీంకోర్టులో ఈ మేరకు కేంద్రం హామీ ఇవ్వడంతో, సెప్టెంబర్ 5న ఢిల్లీలో తలపెట్టిన భారీ నిరసన కవాతును విరమించుకుంటున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రకటించింది.

ప్రశ్నాపత్రాల లీకేజీ బాధితులకు మూడు నెలల్లో కాంపెన్సేషన్ (పరిహారం) అందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. జూలై 20 నుంచి 25 మధ్య జరిగిన స్టూడెంట్ ప్రొటెస్ట్‌లకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్‌లను కొట్టివేయాలని కోరుతూ ఢిల్లీ పోలీసులతో పాటు బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ప్రభుత్వాలు అప్లికేషన్లు ఫైల్ చేసినట్లు సొలిసిటర్ జనరల్ (SG) తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. ఈ ఘటనలపై భవిష్యత్తులో కొత్తగా ఎలాంటి కేసులు నమోదు చేయబోమని కోర్టుకు స్పష్టం చేశారు.

చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ముందు CJP ప్రతినిధి సౌరవ్ దాస్ ఈ నిరసన విరమణ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రభుత్వ హామీలు, న్యాయస్థానం జోక్యం పట్ల నమ్మకంతోనే తాము ఈ ప్రొటెస్ట్ కాల్-ఆఫ్ చేస్తున్నట్లు ఆయన కోర్టుకు తెలిపారు.

ఈ పరిణామంపై CJI సూర్యకాంత్ సానుకూలంగా స్పందించారు. "ఇరు పక్షాలు మంచి ఉద్దేశంతో వ్యవహరిస్తే, ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. ఓపెన్ మైండ్‌తో చర్చిస్తే పరిష్కారం కానిదంటూ ప్రపంచంలో ఏదీ లేదు" అని ఆయన వ్యాఖ్యానించారు.

జూలై 25న కేంద్రం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, విద్యార్థులపై కేసులు వెనక్కి తీసుకోవడంలో జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ ఆగస్టు 24న CJP ఈ నిరసనకు పిలుపునిచ్చింది. ఇండియా గేట్ నుంచి న్యూఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు ఈ మార్చ్ నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే, తాజాగా సుప్రీంకోర్టు జోక్యంతో సమస్యకు సానుకూల ముగింపు లభించింది.

Advertisement
Advertisement