Bhagwant Mann | అత్యాచార కేసుల సెటిల్మెంట్కు సిండికేట్ దందా.. సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు
Bhagwant Mann | పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) భార్య గుర్ప్రీత్ కౌర్ ( Gurpreet Kaur)పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. అత్యాచార కేసుల సెటిల్మెంట్కు సిండికేట్ దందా నడుపుతున్నారని, ఒక్కో కేసు పరిష్కారం కోసం రూ. 5 కోట్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపించింది.
Bhagwant Mann | త్రినేత్ర.న్యూస్ : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) భార్య గుర్ప్రీత్ కౌర్ ( Gurpreet Kaur) పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. అత్యాచారం కేసులను పరిష్కరించేందుకు సీఎం భార్య మధ్యవర్తుల ద్వారా సిండికేట్ దందాను నడుపుతున్నారని తెలిపింది. అత్యాచార కేసులను రూ. 5 కోట్లకు పరిష్కరిస్తున్నారని ఆరోపించింది.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ (Pradeep Bhandari) విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం భార్య అత్యాచార, క్రిమినల్ కేసులను పరిష్కరించడానికి తన రాజకీయ పలుకుబడిన ఉపయోగిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. తనకు ముఖ్యనేతలతో సంబంధాల ఉన్నాయని, అత్యాచార కేసును పరిష్కరిస్తానంటూ ఓ మధ్యవర్తి మాట్లాడిన ఆడియో క్లిప్లను కూడా ప్రదీప్ విడుదల చేశారు. "సీఎం భగవంత్ మాన్, ఆయన భార్య మధ్యవర్తుల ద్వారా ఒక దోపిడీ, అవినీతి దందాను నడుపుతున్నారు. అత్యాచార, క్రిమినల్ కేసులను రూ. 5 కోట్లకు పరిష్కరిస్తున్నారు.
ఇలాంటి కేసులను పరిష్కరించడానికి ముఖ్యమంత్రినే వ్యక్తిగతంగా జోక్యం చేసుకుంటున్నారా..? అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి నివాసం ఒప్పందాలు కుదిరే ప్రదేశంగా మారిపోయింది. ఈ సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన సొమ్మును కొంత పంజాబ్ సూపర్ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు చేరుతోందా..?" అని భండారీ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. సీఎం, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతోనే విపక్షాలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయని మండిపడింది. భండారీ చెప్పిందంతా పూర్తిగా కల్పిత కథ అని పేర్కొంది.
అత్యాచారం కేసును తొక్కిపెట్టేందుకు రూ.5 కోట్లు డిమాండ్
ఇదిలా ఉండగా.. అత్యాచారం కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు సీఎం భార్య రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపిస్తూ పంజాబ్-హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్ జాతీయ మానవ హక్కుల కమిషన్కు (NHRC) ఇటీవలే ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన ఎన్హెచ్ఆర్సీ.. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)ను ఆదేశించింది. ఆరోపణలపై పూర్తి వివరాలు సేకరించి.. తీసుకున్న చర్యలపై నివేదికను రెండు వారాల్లోగా కమిషన్కు సమర్పించాలని స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ అంశాన్ని కేంద్ర హోం శాఖలోని మహిళా భద్రతా విభాగం దృష్టికి కూడా తీసుకెళ్లింది. నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది. ఈ పరిణామాల వేళ బీజేపీ ఆరోపణలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read..
చోరీ భయం.. కారును ఇంటిపైకప్పుపై పార్క్ చేసిన యజమాని
రేవంత్లో టీడీపీ రక్తం.. బ్లాక్ మెయిల్ చేసి బర్తరఫ్ చేశారు : కొండా సురేఖ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bus Rape Case | మీ వైఫల్యాలను ఇంకెంతకాలం కప్పిపుచ్చుకుంటారు? ఢిల్లీ, యూపీ ప్రభుత్వాలను నిలదీసిన రాహుల్
సెప్టెంబర్ 1, 2026

Bhagwant Mann | అత్యాచారం కేసును తొక్కిపెట్టేందుకు రూ.5 కోట్లు డిమాండ్.. పంజాబ్ సీఎం భార్యపై సంచలన ఆరోపణలు
ఆగస్టు 22, 2026

Black Magic | హరీశ్రావుపై క్షుద్ర పూజల ఆరోపణలు.. ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించిన రేవంత్
ఆగస్టు 4, 2026
తాజావార్తలు
- ●Konda Surekha | రేవంత్లో టీడీపీ రక్తం.. బ్లాక్ మెయిల్ చేసి బర్తరఫ్ చేశారు : కొండా సురేఖ
- ●SUV On Rooftop | చోరీ భయం.. కారును ఇంటిపైకప్పుపై పార్క్ చేసిన యజమాని
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో నష్టాలు కంటిన్యూ.. పెరిగిన చమురు ధరలే కారణం..
- ●Ntr | నాన్స్టాప్గా షూటింగ్ - చెప్పిన డేట్కే థియేటర్లలోకి ఎన్టీఆర్ డ్రాగన్
- ●HDFC Bank | హెచ్డీఎఫ్సీ బ్యాంకు పెట్టుబడిదారులకు భారీ షాక్.. రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి..
- ●కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించిన ఆ ఐదు కీలక కారణాలు! ఇవే

Konda Surekha | రేవంత్లో టీడీపీ రక్తం.. బ్లాక్ మెయిల్ చేసి బర్తరఫ్ చేశారు : కొండా సురేఖ

SUV On Rooftop | చోరీ భయం.. కారును ఇంటిపైకప్పుపై పార్క్ చేసిన యజమాని

Stock Markets | స్టాక్ మార్కెట్లలో నష్టాలు కంటిన్యూ.. పెరిగిన చమురు ధరలే కారణం..

Ntr | నాన్స్టాప్గా షూటింగ్ - చెప్పిన డేట్కే థియేటర్లలోకి ఎన్టీఆర్ డ్రాగన్



