Ayodhya Ram Temple | సీఈవో పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్న అయోధ్య ట్రస్టు.. అర్హతలు ఇవే
Ayodhya Ram Temple | అయోధ్య రామాలయంలో (Ayodhya Ram Temple) భక్తులు సమర్పించిన విరాళాలు దుర్వినియోగం ఆరోపణల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆలయ నిర్వహణ, పరిపాలన కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (Chief Executive Officer)ను నియమించనున్నది. ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Ayodhya Ram Temple | అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామమందిరం (Ayodhya Ram Temple) నిర్వహణ, పరిపాలన కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (Chief Executive Officer)ను నియమించనున్నది. ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు సీఈవో పోస్టుకు ఉండాల్సిన అర్హతల గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.
ట్రస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అడ్మినిస్టేషన్ లేదా ఫైనాన్స్ రంగాల్లో కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలి. హిందూ మత విశ్వాసాలు కలిగి ఉండి. దేవాలయాలు లేదా పెద్ద సంస్థలను నిర్వహించిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఇక అభ్యర్థి వయస్సు 50 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి. హిందీ, ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఎంపికైన అభ్యర్థిని మొదట మూడేళ్ల కాలానికి నియమిస్తారు. వీరు ఈ పదవీ కాలంలో అయోధ్యలోనే నివాసం ఉండాల్సి ఉంటుంది. రామాలయ రోజువారీ పరిపాలన, ట్రస్ట్ నిర్ణయాల అమలు, సిబ్బంది పర్యవేక్షణ, ఆలయ సముదాయం సజావుగా పనిచేసేలా చూడటం సీఈవో బాధ్యత.
ఆసక్తి గల అభ్యర్థులు జులై 18వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. సెలెక్షన్ ప్రక్రియలో భాగంగా ట్రస్ట్ ఏర్పాటు చేసిన కమిటీ దరఖాస్తులను పరిశీలించి షార్ట్లిస్టు చేస్తుంది. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి తన సిఫార్సులను అందజేస్తుంది. జులై 22న జరిగే ట్రస్ట్ సమావేశంలో తుది అభ్యర్థిని ఖరారు చేస్తారు. జీతం, ఇతర వివరాల గురించి ఇంటర్వ్యూలో చర్చిస్తారు. దరఖాస్తుకు చివరి గడువు అయిన జులై 18 తర్వాత నెలరోజుల్లోగా ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని ఆలయ కమిటీ భావిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న వాళ్లు గడువులోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
श्री राम जन्मभूमि तीर्थक्षेत्र (न्यास) श्री राम जन्मभूमि मंदिर के मुख्य कार्यकारी अधिकारी पद के लिए योग्य जनों से आवेदन आमंत्रित करता है
आवेदन की अंतिम तिथि: शनिवार १८ जुलाई २०२६; सायं ४ बजे
Shri Ram Janmabhoomi Teerth Kshetra (Trust) invites applications from eligible… pic.twitter.com/PHa0MbT5kY
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) July 13, 2026
Also Read..
పౌరసత్వ నిర్ధారణ న్యాయబద్ధంగా ఉండాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఇరాన్ హిట్లిస్ట్.. జాబితాలో ట్రంప్, నెతన్యాహు, మెలోనీ, మాక్రాన్..
ఎస్ఎస్ఎస్ - శ్రీలీల డ్రీమ్బాయ్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఇవేనట!
సంబంధిత వార్తలు

Ram Mandir Construction | జులై 30 నాటికి రామ మందిరం నిర్మాణ పనులు పూర్తి : నృపేంద్ర మిశ్రా
జులై 11, 2026

Priyank Kharge | ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు వచ్చినప్పుడల్లా ప్రధాని విదేశాలకు వెళ్తారు : ప్రియాంక్ ఖర్గే
జులై 8, 2026

Uddhav Thackeray | విరాళాల చోరీపై “రామ రక్ష” నిరసనలకు పిలుపునిచ్చిన శివసేన
జులై 3, 2026
తాజావార్తలు
- ●Rahul Gandhi | దేశ విద్యావ్యవస్థ దోపిడీ యంత్రాంగంగా మారింది.. ప్రక్షాళన చేయాలి : రాహుల్ గాంధీ
- ●Shabad Rajkumar Suicide | షాబాద్ ‘సైకో కిల్లర్’ మృతి.. మేనమామ ఊరిలో ఆత్మహత్య
- ●AI Payments | యూపీఐలో ఏఐ విప్లవం.. ఇక వినియోగదారుల అనుమతితో చెల్లింపులు చేయనున్న స్మార్ట్ ఏజెంట్లు..
- ●Ponnam Prabhakar | 3427 దేవాలయాలకు రూ.15.05 కోట్లు విడుదల చేశాం
- ●KGBV Sangareddy Protest | ప్రిన్సిపాల్స్ 'ఈగో' వార్.. నడిరోడ్డుపై 200 మంది విద్యార్థినుల కన్నీటి ధర్నా!
- ●Sreeleela | ఎస్ఎస్ఎస్ - శ్రీలీల డ్రీమ్బాయ్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఇవేనట!

Rahul Gandhi | దేశ విద్యావ్యవస్థ దోపిడీ యంత్రాంగంగా మారింది.. ప్రక్షాళన చేయాలి : రాహుల్ గాంధీ

Shabad Rajkumar Suicide | షాబాద్ ‘సైకో కిల్లర్’ మృతి.. మేనమామ ఊరిలో ఆత్మహత్య

AI Payments | యూపీఐలో ఏఐ విప్లవం.. ఇక వినియోగదారుల అనుమతితో చెల్లింపులు చేయనున్న స్మార్ట్ ఏజెంట్లు..

Ponnam Prabhakar | 3427 దేవాలయాలకు రూ.15.05 కోట్లు విడుదల చేశాం



