శబరిమలలో తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారుల దాడి.. హైదరాబాద్ భక్తుడికి తీవ్ర గాయాలు
పవిత్ర పుణ్యక్షేత్రమైన కేరళలోని శబరిమలలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. శబరిమల కొండపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారులు దాడి చేశారు. ఈ ఘటనలో హైదరాబాద్ భక్తుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.
హైదరాబాద్కి చెందిన ఓ అయ్యప్ప భక్తుడు శబరిమలలో ఉన్న ఓ షాపులో వాటర్ బాటిల్ కొన్నాడు. ఆ బాటిల్ ధరను ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తుండటంతో సదరు వ్యాపారిని భక్తుడు ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన ఆ షాపు యజమాని, షాపులో ఉన్న గాజు సీసాతో భక్తుడి తల పగులగొట్టాడు. దీంతో ఆ భక్తుడికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున ఆ షాపు వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఆ వ్యాపారి దాడిని నిరసిస్తూ షాపు ముందు బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న భక్తులను, వ్యాపారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మిగితా విషయాలు తెలియాల్సి ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






