త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

శబరిమలలో తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారుల దాడి.. హైదరాబాద్ భక్తుడికి తీవ్ర గాయాలు

J

National | Published On Dec 5, 2025, 6.08 am IST

శబరిమలలో తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారుల దాడి.. హైదరాబాద్ భక్తుడికి తీవ్ర గాయాలు
Advertisement

పవిత్ర పుణ్యక్షేత్రమైన కేరళలోని శబరిమలలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. శబరిమల కొండపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారులు దాడి చేశారు. ఈ ఘటనలో హైదరాబాద్ భక్తుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.

హైదరాబాద్‌కి చెందిన ఓ అయ్యప్ప భక్తుడు శబరిమలలో ఉన్న ఓ షాపులో వాటర్ బాటిల్ కొన్నాడు. ఆ బాటిల్ ధరను ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తుండటంతో సదరు వ్యాపారిని భక్తుడు ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన ఆ షాపు యజమాని, షాపులో ఉన్న గాజు సీసాతో భక్తుడి తల పగులగొట్టాడు. దీంతో ఆ భక్తుడికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ విషయం తెలుసుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున ఆ షాపు వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఆ వ్యాపారి దాడిని నిరసిస్తూ షాపు ముందు బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న భక్తులను, వ్యాపారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మిగితా విషయాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement