త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Airports | ఈ నాలుగు న‌గ‌రాల్లో మూత‌ప‌డ‌నున్న విమానాశ్ర‌యాలు.. కారణం ఏంటంటే?

Airports | దేశంలోనే నాలుగు ప్ర‌ధాన న‌గరాల్లో విమానాశ్ర‌యాలు (Airports) త్వ‌ర‌లో మూత‌ప‌డ‌నున్నాయి. దేశ స‌రిహ‌ద్దుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న ఈ ఎయిర్‌పోర్టుల‌ను పౌర విమాన‌యాన‌, మిలిట‌రీ అవ‌స‌రాల కోసం వినియోగిస్తున్నారు.

G

National | Published On Mar 21, 2026, 6.08 am IST

Airports | ఈ నాలుగు న‌గ‌రాల్లో మూత‌ప‌డ‌నున్న విమానాశ్ర‌యాలు.. కారణం ఏంటంటే?
Advertisement

Airports | త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలోనే నాలుగు ప్ర‌ధాన న‌గరాల్లో విమానాశ్ర‌యాలు (Airports) త్వ‌ర‌లో మూత‌ప‌డ‌నున్నాయి. దేశ స‌రిహ‌ద్దుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న ఈ ఎయిర్‌పోర్టుల‌ను పౌర విమాన‌యాన‌, మిలిట‌రీ అవ‌స‌రాల కోసం వినియోగిస్తున్నారు. అందువ‌ల్ల ఈ విమానాశ్ర‌యాల్లో అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ఫైట‌ర్ జెట్, ఇత‌ర మిలిట‌రీ విమానాలు దిగేలా ర‌న్‌వేల‌ను (runway) సిద్ధం చేయాల్సి ఉన్న‌ది. రన్‌వేల పునరుద్ధరణ పనుల కారణంగా భారత వైమానిక దళం (IAF) నియంత్రణలో ఉన్న శ్రీన‌గ‌ర్‌, జోధ్‌పూర్‌, పుణె, అదంపూర్ ఎయిర్‌పోర్టుల‌ను తాత్కాలికంగా మూసివేయ‌నున్నారు. వీటిలో జోధ్‌పూర్ విమానాశ్ర‌యం దాదాపు నెల రోజుల‌పాటు మూత‌ప‌డ‌నుంది. దీంతో పౌర విమానయాన‌ సేవ‌ల‌కు అంత‌రాయం క‌లుగ‌నుంది. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌ (IAF) విమాన‌యాన సంస్థ‌ల‌కు 'నోటీసు టు ఎయిర్‌మెన్స్‌` విడుద‌ల చేసింది. నోటీసులు ఇచ్చింది.

రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్‌లో (Jodhpur) ఉన్న విమానాశ్ర‌యం తొలుత మూత‌ప‌డ‌నుంది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 27 వ‌ర‌కు పౌర‌ విమానాల రాక‌పోక‌ల‌ను అనుమ‌తివ్వ‌రు. విమానాశ్రయ గోడల పునరుద్ధరణ పనులు మూడు దశల్లో జరుగుతాయి, చివరి దశ మే నాటికి పూర్తి అవనుంది. ఈ నేప‌థ్యంలో ఇండిగో, ఎయిర్ ఇండియా మరియు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌తో సహా పలు విమానయాన సంస్థలు ఇప్పటికే మార్చి 28 తర్వాత బుకింగ్‌లను నిలిపివేశాయి. ఈ విమానాశ్రయం పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉండటం దాని వ్యూహాత్మక ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది, అందువల్ల ఈ ఆధునీకరణ అత్యంత కీలకం కానుంది.

శ్రీన‌గ‌ర్ (Srinagar) విమానాశ్రయాన్ని ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య వరకు వారాంతాల్లో మూసివేనున్నాయి. దీంతో ఇక్క‌డ‌ అడపాదడపా అంతరాయాలు ఏర్పడతాయి. మిగిలిన ఆరు రోజులు విమాన స‌ర్వీసులు న‌డ‌వ‌నున్నాయి. అయితే అక్టోబ‌ర్ 16 నుంచి న‌వంబ‌ర్ 5 వ‌ర‌కు పూర్తిగా మూసివేయ‌నున్నారు.

ఇక పుణె (Pune) విమానాశ్ర‌యం మూసివేత‌కు సంబంధించి క‌చ్చిత‌మైన తేదీలు ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. అయితే ఈ ఏడాది చివ‌ర్లో ర‌న్‌వే పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు జ‌రుగ‌నున్నాయి. షెడ్యూల్ ఖరారైన తర్వాత ప్రయాణికులు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.

వీటిలో అత్యంత ప్ర‌ధాన‌మైన పంజాబ్‌లోని అదంపూర్ (Adampur) విమానాశ్ర‌యం అత్య‌ధిక కాలం మూత‌ప‌డ‌నుంది. ఈ వైమానిక స్థావ‌రంలో న‌వంబ‌ర్ త‌ర్వాత రన్‌వే పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు జ‌రుగ‌నున్నాయి. ఇక్క‌డ దాదాపు 8 నెల‌ల‌పాటు ప‌నులు కొన‌సాగ‌నున్న‌ట్లు తెలుస్తున్న‌ది. పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉండటం, అలాగే ఆపరేషన్ సిందూర్‌తో సహా ఇటీవలి కార్యకలాపాలలో దాని పాత్ర కారణంగా ఈ స్థావరం వ్యూహాత్మక ప్రాముఖ్యతను సంత‌రించుకున్న‌ది.

మూసివేత ఎందుకంటే..

ఈ నాలుగు ఎయిర్‌పోర్టులను సాధారణ పౌర విమానాశ్రయాల్లా సైనిక కార్యకలాపాల కోసం కూడా వినియోగిస్తున్నారు. రన్‌వేలు యుద్ధ విమానాలు, ఇతర రక్షణ విమానాల అవసరాలను తీర్చాల్సి ఉంటుంది, అందువల్ల నిర్వహణ తప్పనిసరి.

Advertisement

తాజావార్తలు

Advertisement