త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Air India Express | విమానం గాల్లో ఉండ‌గా పొగ‌లు.. ల‌క్నోలో ఎమ‌ర్జెన్సీ లాండింగ్‌..!

Air India Express | ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం గాల్లో ఉండ‌గానే పొగలు రావ‌డంతో ఆ విమానాన్ని లక్నోలో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పరిస్థితి అత్య‌వ‌స‌రంగా ఉండ‌డంతో పైలట్ ‘పాన్-పాన్’ కాల్ ఇచ్చి సమాచారాన్ని తెలియజేశారు.

P

National | Published On Mar 31, 2026, 8.54 pm IST

Air India Express | విమానం గాల్లో ఉండ‌గా పొగ‌లు.. ల‌క్నోలో ఎమ‌ర్జెన్సీ లాండింగ్‌..!
Advertisement

Air India Express | ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం గాల్లో ఉండ‌గానే పొగలు రావ‌డంతో ఆ విమానాన్ని లక్నోలో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పరిస్థితి అత్య‌వ‌స‌రంగా ఉండ‌డంతో పైలట్ ‘పాన్-పాన్’ కాల్ ఇచ్చి సమాచారాన్ని తెలియజేశారు. సోమవారం సాయంత్రం బాగ్‌డోగ్రా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఈ విమానంలో ప్రయాణ మధ్యలో ఉన్న స‌మ‌యంలో పొగ‌లు రావ‌డాన్ని గ‌మ‌నించారు. దీంతో విమానాన్ని లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు.

విమానంలోని అవియానిక్స్ బేలో పొగ కనిపించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. అత్యవసర పరిస్థితిని సూచించేందుకు పైలట్ ‘మేడే’ కాల్‌కు బదులుగా ‘పాన్-పాన్’ కాల్ ఇచ్చారు. ఈ స‌మ‌యంలో 148 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. లక్నోలో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ జాగ్రత్త చర్యగా విమానాన్ని మళ్లించినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది.

ల్యాండింగ్ అనంతరం ప్రయాణికులకు అల్పాహారం అందించి, ఆ త‌ర్వాత ఢిల్లీకి వెళ్లేందుకు ప్రత్యామ్నాయ విమానాల్లో ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై స్పందించిన సంస్థ ప్రతినిధి, నిబంధనల ప్రకారం భద్రతా చర్యలు తీసుకుని విమానాన్ని మళ్లించామని తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కూడా చెప్పారు. లక్నోలో దిగిన తర్వాత విమానాన్ని ‘ఎయిర్‌క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్’ (AOG)గా ప్రకటించారు. అంటే విమానం పూర్తిస్థాయి సాంకేతిక తనిఖీలు, అవసరమైన మరమ్మతుల లక్నో విమానాశ్రయంలోనే ఉంచారు.

Advertisement

తాజావార్తలు

Advertisement