KTR | వర్షాలు బాగా పడాలే.. రాష్ట్రం పచ్చగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నా
KTR | రాష్ట్రంలో వర్షాలు సృద్ధిగా పడాలని ఉజ్జయినీ అమ్మవారిని సమష్టిగా మొక్కుకున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రైతు సంతోషంగా ఉండాలని కోరుకున్నామన్నారు. రైతు సంతోషంగా ఉంటే రాష్ట్రం కళకళలాడుతుందన్నారు. రాష్ట్రం పచ్చగా ఉండడంతో పాటు శాంతిభద్రతలు బాగుండాలని కోరుకున్నామని పేర్కొన్నారు.
- రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం కళకళలాడుతుంది
- సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి దర్శనలో కేటీఆర్ ఆకాంక్ష
త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో వర్షాలు సృద్ధిగా పడాలని ఉజ్జయినీ అమ్మవారిని సమష్టిగా మొక్కుకున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రైతు సంతోషంగా ఉండాలని కోరుకున్నామన్నారు. రైతు సంతోషంగా ఉంటే రాష్ట్రం కళకళలాడుతుందన్నారు. రాష్ట్రం పచ్చగా ఉండడంతో పాటు శాంతిభద్రతలు బాగుండాలని కోరుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ పిల్లలందరికీ అమ్మవారిని ఆశీస్సులుండాని ఆకాంక్షించామన్నారు. లష్కర్ బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉజ్జయినీ ఆశీస్సులతోనే తెలంగాణ సాధించాం..
50 సంవత్సరాలుగా ఎన్నడూ కూడా ఈ ఉజ్జయినీ అమ్మవారి బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించాలన్న డిమాండ్ను ఎవరూ పట్టించుకోలే. కానీ కేసీఆర్ నాయకత్వంలో తలసాని శ్రీనివాస్యాదవ్, హైదరాబాద్కు చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు వచ్చి ఇది తప్పకుండా మనం చేయాల్సిన పని అని అన్నరు. ఉజ్జయినీ ఆశీస్సులతోనే తెలంగాణ సాధించామని కేసీఆర్ చెప్పారు. అందుకే ఆ తల్లికి బంగారు బోనం సమర్పిద్దామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించారు.

ఇంకా రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి చేసి చూపెట్టాం కూడా. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి రూ. 1800 కోట్ల నిధులు కేటాయించి యాదాద్రి దేవాలయాన్ని అత్యద్భుతంగా నిర్మించిన నాయకుడు కేసీఆర్. హైదరాబాద్లోని ప్రతి గుడికి తలసాని నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25 వేల కోట్ల రూపాయలు విడుదల చేశాం. ప్రతి ఉత్సవ కమిటీకి, ఆలయ కమిటీకి డబ్బులు ఇచ్చాం. ఎవరి దగ్గరా చందా వసూలు చేసే అవసరం రాకుండా చూశాం. ఆలయాలు, పండుగల నిర్వహణ అద్భుతంగా చేసి చూపెట్టాం. భక్తి ప్రపత్తులతో, దైవ సంకల్పంతో ప్రతి కార్యక్రమాని నిర్వహించారు కేసీఆర్.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | ‘మహా’ ఓనర్ వంశీని ప్రశ్నించే దమ్ము లేదా? పోలీసులకు ఆదేశాలు ఎవరిస్తున్నరు?
ఆగస్టు 2, 2026

Mallu Bhatti Vikramarka | తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచ వేదికపై చాటనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఆగస్టు 2, 2026

Ponnam Prabhakar | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు: మంత్రి పొన్నం ప్రభాకర్
ఆగస్టు 2, 2026
తాజావార్తలు
- ●RS Praveen Kumar | ‘మహా’ ఓనర్ వంశీని ప్రశ్నించే దమ్ము లేదా? పోలీసులకు ఆదేశాలు ఎవరిస్తున్నరు?
- ●Mallu Bhatti Vikramarka | తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచ వేదికపై చాటనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Hyderabad biker | హిమాచల్లో హైదరాబాద్ బైక్ రైడర్ అదృశ్యం.. రెండు వారాలైనా లభించని ఆచూకీ
- ●VC Sajjanar | ప్రశాంత వాతావరణంలో వైభవంగా బోనాల ఉత్సవాలు: సీపీ సజ్జనర్
- ●Ponnam Prabhakar | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Infosys | ఐటీ పరిశ్రమల శ్రమదోపిడీ.. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్కు భారీగా ఫైన్

RS Praveen Kumar | ‘మహా’ ఓనర్ వంశీని ప్రశ్నించే దమ్ము లేదా? పోలీసులకు ఆదేశాలు ఎవరిస్తున్నరు?

Mallu Bhatti Vikramarka | తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచ వేదికపై చాటనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Hyderabad biker | హిమాచల్లో హైదరాబాద్ బైక్ రైడర్ అదృశ్యం.. రెండు వారాలైనా లభించని ఆచూకీ

VC Sajjanar | ప్రశాంత వాతావరణంలో వైభవంగా బోనాల ఉత్సవాలు: సీపీ సజ్జనర్



