త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AICC Appoints Senior Observers | అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సమరశంఖం: కీలక రాష్ట్రాలకు ఏఐసీసీ సీనియర్ అబ్జర్వర్ల నియామకం!

అసెంబ్లీ ఎన్నికల బరిలోకి కాంగ్రెస్ అగ్రనేతలు. అస్సాం, కేరళ, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల కోసం ఏఐసీసీ సీనియర్ అబ్జర్వర్ల నియామకం. సచిన్ పైలట్, డి.కె. శివకుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి కీలక నేతలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానం.

J

National | Published On Jan 7, 2026, 8.53 pm IST

AICC Appoints Senior Observers | అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సమరశంఖం: కీలక రాష్ట్రాలకు ఏఐసీసీ సీనియర్ అబ్జర్వర్ల నియామకం!

సంక్షిప్త సారాంశం

రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా అస్సాం, కేరళ, తమిళనాడు & పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఏఐసీసీ (AICC) సీనియర్ అబ్జర్వర్లను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తమిళనాడు, పుదుచ్చేరి బాధ్యతలు అప్పగించడం విశేషం.

Advertisement

AICC Appoints Senior Observers | దేశంలో త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పార్టీ వ్యూహాలను పర్యవేక్షించేందుకు, సమన్వయం చేసేందుకు వీలుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పలువురు అగ్రనేతలను 'ఏఐసీసీ సీనియర్ అబ్జర్వర్లు'గా నియమించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ బుధవారం అధికారికంగా ప్రకటించారు.

రాష్ట్రాల వారీగా నియమితులైన సీనియర్ అబ్జర్వర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

అస్సాం (Assam):

అస్సాం ఎన్నికల బాధ్యతలను ముగ్గురు కీలక నేతలు భూపేష్ బఘేల్, డి.కె.శివకుమార్, బంధు తిర్కీకి అప్పగించారు.

కేరళ (Kerala):

కేరళ కోసం నలుగురు ప్రముఖ నేతలను రంగంలోకి దించారు. వాళ్లు సచిన్ పైలట్, కె.జె.జార్, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, కన్హయ్య కుమార్

తమిళనాడు & పుదుచ్చేరి (Tamil Nadu & Puducherry):

ఈ ప్రాంతాలకు ముగ్గురు అబ్జర్వర్లను నియమించారు. ఇందులో తెలంగాణకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు దక్కడం విశేషం. ముకుల్ వాస్నిక్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖాజీ మహమ్మద్ నిజాముద్దీన్‌ను తమిళనాడు, పుదుచ్చేరి అబ్జర్వర్లుగా నియమించారు.

పశ్చిమ బెంగాల్ (West Bengal):

బెంగాల్ ఎన్నికల పర్యవేక్షణకు ముగ్గురు నేతలు సుదీప్ రాయ్ బర్మన్, షకీల్ అహ్మద్ ఖాన్, ప్రకాష్ జోషి ఎంపిక చేశారు.

ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని పార్టీ ప్రకటించింది. రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలుపు తీరాలకు చేర్చేందుకు ఈ సీనియర్ నేతలు క్షేత్రస్థాయిలో వ్యూహరచన చేయనున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement