త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AAP | రాఘవ్‌ చద్దా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన అరవింద్‌ కేజ్రీవాల్‌..!

AAP | రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఆధ్వర్యంలో పలువురు ఎంపీలు పార్టీకి రాజీనామా చేయడం ఆమ్ ఆద్మీ పార్టీలో తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామంపై ఆప్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పార్టీని వీడిన వారిని ‘ద్రోహులు’గా తీవ్రంగా విమర్శించారు.

P

National | Published On Apr 24, 2026, 9.45 pm IST

AAP | రాఘవ్‌ చద్దా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన అరవింద్‌ కేజ్రీవాల్‌..!
Advertisement

AAP | రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఆధ్వర్యంలో పలువురు ఎంపీలు పార్టీకి రాజీనామా చేయడం ఆమ్ ఆద్మీ పార్టీలో తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామంపై ఆప్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పార్టీని వీడిన వారిని ‘ద్రోహులు’గా తీవ్రంగా విమర్శించారు. పంజాబ్ ప్రజలు ఈ చర్యను ఎప్పటికీ మర్చిపోరని, క్షమించరని స్పష్టం చేశారు. ఈ పరిణామాల వెనుక భారతీయ జనతా పార్టీ ప్రమేయం ఉందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నుంచి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వరకు నాయకులు ఆరోపణలు గుప్పించారు. ‘పంజాబ్ ప్రజల నమ్మకానికి బీజేపీ మరోసారి ద్రోహం చేసింది’ అని కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ లోటస్’ అమలు చేశారని ఆరోపించారు.

పార్టీని విడిచిన ఎంపీలపై సంజయ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ.. ‘ఆమ్ ఆద్మీ పార్టీకి, పంజాబ్ ప్రజలకు ఎప్పుడెప్పుడు ద్రోహం జరిగిందో, ప్రజలు తగిన సమాధానం ఇచ్చారు. ఈసారి కూడా అదే జరుగుతుంది’ అన్నారు. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన పార్టీలో చేరి నిజాయతీ గురించి ఎలా మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. అలాగే, రైతు హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి కుటుంబానికి చెందినవారు ఉన్న పార్టీలో చేరడంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఇది అత్యంత దిగజారుడు చర్యగా పేర్కొంటూ పార్టీ అధికార ప్రతినిధి అనురాగ్ దండా స్పందించారు. మరోవైపు, పంజాబ్ యూనిట్ ప్రధాన కార్యదర్శి బల్తేజ్ పన్నూ మాట్లాడుతూ కేంద్ర సంస్థలను ఉపయోగించి ఆప్‌ను బలహీనపరిచే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ ప్రక్రియలో భాగంగా రాఘవ్ చద్దాను అమిత్ షా ఒక సాధనంగా ఉపయోగించారని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement