త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Andhra Pradesh | సంక్రాంతి పండుగ వేళ తీవ్ర విషాదం.. కాలి బూడిదైన 38 ఇళ్లు

Andhra Pradesh | సంక్రాంతి పండుగ వేళ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విషాదం నెల‌కొంది. కాకినాడ జిల్లా మన్యం గ్రామం సార్లంకపల్లెలో నిన్న సాయంత్రం ఘోర అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది.

S

National | Published On Jan 13, 2026, 2.47 pm IST

Andhra Pradesh | సంక్రాంతి పండుగ వేళ తీవ్ర విషాదం.. కాలి బూడిదైన 38 ఇళ్లు
Advertisement

Andhra Pradesh | త్రినేత్ర‌.న్యూస్ : సంక్రాంతి పండుగ వేళ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విషాదం నెల‌కొంది. కాకినాడ జిల్లా మన్యం గ్రామం సార్లంకపల్లెలో నిన్న సాయంత్రం ఘోర అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఓ గుడిసెలో చెల‌రేగిన మంట‌లు.. మొత్తం 38 గుడిసెల‌కు వ్యాపించాయి. అన్ని గుడిసెలు కూడా కాలి బూడిద‌య్యాయి.

సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో సార్లంక‌ప‌ల్లె గ్రామ‌స్తులంద‌రూ స‌రుకులు, కొత్త‌బ‌ట్ట‌లు కొనుక్కునేందుకు 50 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న తునికి నిన్న సాయంత్రం వెళ్లారు. వాళ్లు తిరిగొచ్చే లోపే ఊరంతా కాలిపోయింది. తాటాకు గుడిసెల‌న్నీ బూడిద‌గా మారాయి. విలువైన వ‌స్తువులు, బ‌ట్ట‌ల‌తో పాటు ఆధార్ కార్డు వంటి కీల‌క‌మైన డాక్యుమెంట్లు కూడా కాలిపోయాయి. గ్రామ‌స్తులంద‌రూ క‌ట్టుబ‌ట్ట‌ల‌తో రోడ్డున ప‌డ్డారు. గ్యాస్ లీక్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసుల అనుమానం వ్య‌క్తం చేశారు.

సార్లంక‌ప‌ల్లె గ్రామ‌స్తులంద‌రికీ అండ‌గా ఉండాల‌ని సీఎం చంద్ర‌బాబు స్థానిక నేత‌ల‌కు, అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. త‌క్ష‌ణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ. 25 వేల న‌గ‌దును అంద‌జేయాల‌ని సూచించారు. ఇల్లు కోల్పోయిన ప్ర‌తి కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాల‌ని సీఎం ఆదేశించారు. అప్ప‌టి వ‌ర‌కు బాధితుల‌కు అవ‌స‌ర‌మైన వ‌స‌తి, ఇత‌ర స‌హాయం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌మాదంలో కాలిపోయిన డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు ఇచ్చేందుకు ప్ర‌త్యేక క్యాంపులు నిర్వ‌హించాల‌న్నారు.

https://x.com/i/status/2010933785312043358

Advertisement

తాజావార్తలు

Advertisement