Vaakiti Srihari | మంత్రి వాకిటి శ్రీహరికి తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చికిత్స
Vaakiti Srihari | త్రినేత్ర.న్యూస్: మంత్రి వాకిటి శ్రీహరి (Vaakiti Srihari) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన బంజారాహిల్స్లోని కేర్ దవాఖానలో చేరారు. వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. గత రెండు రోజులుగా తీవ్ర జ్వరం (Viral Fever), ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ప్రస్తుతం మంత్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మరో రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వెల్లడించారు.
కాగా, జర్వంతో బాధపడుతున్నప్పటికీ గురువారం గాంధీభవన్లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి గురువారం ఆయన 100కు పైగా వినతులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే ఆయనకు జ్వరం తీవ్రమయినట్లు తెలుస్తున్నది.
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మంత్రుల ముఖాముఖీ
కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల కోసం పనిచేసే పార్టీ అని.. ప్రజల సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో గాంధీభవన్లో మంత్రులతో 'ముఖాముఖి' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. వచ్చే ప్రతి వినతిని బాధ్యతగా తీసుకుని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి గురువారం ఆయన 100కు పైగా వినతులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పార్టీలకు అతీతంగా పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ పింక్ మీడియా ద్వారా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తోంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలన తెలంగాణను అప్పుల పాలు చేసింది. కాళేశ్వరం అంశంపై బీఆర్ఎస్ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సబ్సిడీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అమలవుతున్నాయి. కాళేశ్వరం నీళ్లు లేకపోయినా తెలంగాణ రైతులు అత్యధిక దిగుబడులు సాధించారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు వాస్తవాలను గుర్తించి ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలి అని వాకిటి కోరారు.
ముఖాముఖి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం అత్యధిక సంఖ్యలో ప్రజలు వినతులు అందజేశారు. ఈ ప్రభుత్వం పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తోంది. బీఆర్ఎస్ మాటల గారడీతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తోంది. తొమ్మిదిన్నర ఏళ్లు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వారు ఇప్పుడు మూడు నెలలు అప్పగించమని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అని ఆయన విమర్శించారు.
తాజావార్తలు
- ●NEET UG Results | నీట్ యూజీ ఫలితాలు విడుదల.. హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంకు
- ●Horoscope | జూలై 17 రాశి ఫలాలు.. ఈ రాశివారికి అడ్డంకులు ఉండవచ్చు!
- ●Thailand Visa-Free Entry 2026 | థాయ్లాండ్ ప్లాన్ చేస్తున్నారా : భారతీయులకు వీసా-ఫ్రీ ఎంట్రీ.. కానీ ఆ ఒక్క రూల్ మారింది!
- ●Naveen Jain | ఏ ప్లాన్ లేకుండానే మైక్రోసాఫ్ట్ జాబ్ వదిలేశాడు.. ఇప్పుడు $40 బిలియన్ల కంపెనీగా ఎదిగాడు: ఐఐటీయన్ సక్సెస్ స్టోరీ!
- ●Fast Eating Psychology | ప్లేట్ అప్పుడే ఖాళీ అయిపోయిందా? చాలా ఫాస్ట్గా ఫుడ్ తినేసే వారి మైండ్సెట్ ఎలా ఉంటుందో తెలుసా?
- ●EHCT | ఉద్యోగుల ఆరోగ్య పథకానికి కొత్త ఊపు.. ఈహెచ్సీటీకి పూర్తి అధికారాలు

NEET UG Results | నీట్ యూజీ ఫలితాలు విడుదల.. హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంకు

Horoscope | జూలై 17 రాశి ఫలాలు.. ఈ రాశివారికి అడ్డంకులు ఉండవచ్చు!

Thailand Visa-Free Entry 2026 | థాయ్లాండ్ ప్లాన్ చేస్తున్నారా : భారతీయులకు వీసా-ఫ్రీ ఎంట్రీ.. కానీ ఆ ఒక్క రూల్ మారింది!

Naveen Jain | ఏ ప్లాన్ లేకుండానే మైక్రోసాఫ్ట్ జాబ్ వదిలేశాడు.. ఇప్పుడు $40 బిలియన్ల కంపెనీగా ఎదిగాడు: ఐఐటీయన్ సక్సెస్ స్టోరీ!





