త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mother Kills Son | మ‌ద్యానికి బానిసై వేధిస్తున్నాడ‌ని.. క‌న్న‌కొడుకును క‌త్తెర‌తో పొడిచి క‌డ‌తేర్చింది..

Mother Kills Son | కొడుకు మ‌ద్యానికి (Alcohol Adict) బానిస‌య్యాడు. రోజూ తాగడానికి డ‌బ్బు కోసం వేధిస్తున్నాడు. భరించ‌లేక ఆ త‌ల్లి కొడుకుని దారుణంగా (Mother Kills Son) హ‌త్య‌చేసింది. ఈ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంత‌పురంలో (Anantapur) చోటుచేసుకుంది.

G

Andhra pradesh | Published On Jul 14, 2026, 7.54 am IST

Mother Kills Son | మ‌ద్యానికి బానిసై వేధిస్తున్నాడ‌ని.. క‌న్న‌కొడుకును క‌త్తెర‌తో పొడిచి క‌డ‌తేర్చింది..
Advertisement

Mother Kills Son | త్రినేత్ర‌.న్యూస్‌: కొడుకు మ‌ద్యానికి (Alcohol Adict) బానిస‌య్యాడు. రోజూ తాగడానికి డ‌బ్బు కోసం వేధిస్తున్నాడు. భరించ‌లేక ఆ త‌ల్లి కొడుకుని దారుణంగా (Mother Kills Son) హ‌త్య‌చేసింది. ఈ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంత‌పురంలో (Anantapur) చోటుచేసుకుంది.

అనంతపురం నగరానికి చెందిన బోనాల‌ సునీత‌, సురేంద్ర (28) త‌ల్లీ కొడుకులు. జులాయిగా తిరుగుతున్న సురేంద్ర మద్యానికి బానిసైయ్యాడు. రోజూ తాగ‌డానికి డబ్బులు కావాలంటూ తల్లిని వేధిస్తున్నాడు. రోజురోజుకు చిత్రహింసలు, మానసిక వేధింపుల‌కు ఎక్కువైపోతున్నాయి. ఈ క్ర‌మంలో సోమ‌వారం కూడా త‌ల్లీ కొడుకుల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సునీత‌.. ఇంట్లో ఉన్న కత్తెరను తీసుకుని సురేంద్ర గొంతులో బలంగా పొడిచింది. దీంతో అత‌డు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సునీతను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. వేధింపుల వల్లే హత్యకు పాల్ప‌డిందా, లేక ఇత‌ర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement