SIR | బెంగాల్ ఓటర్లలో గందరగోళం.. ఒకే ఊర్లో 4 వేల ఓట్ల తొలగింపు..
SIR | కేంద్ర ఎన్నికల సంఘం (CEC) చేపట్టిన ప్రత్యేక విస్తృత ఓటర్ల సవరణ (SIR) పశ్చిమ బెంగాల్ (West Bengal) ఓటర్లలో గందరగోళం సృష్టిస్తున్నది. సీఈసీ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఓటర్ల జాబితా నుంచి దాదాపు 91 లక్షల మందిని (Voters Deleted) తొలగించారు. ఇందులో ఒక్క మాల్దా జిల్లాలోనే 2.39 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
SIR | త్రినేత్ర.న్యూస్: కేంద్ర ఎన్నికల సంఘం (CEC) చేపట్టిన ప్రత్యేక విస్తృత ఓటర్ల సవరణ (SIR) పశ్చిమ బెంగాల్ (West Bengal) ఓటర్లలో గందరగోళం సృష్టిస్తున్నది. సీఈసీ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఓటర్ల జాబితా నుంచి దాదాపు 91 లక్షల మందిని (Voters Deleted) తొలగించారు. ఇందులో ఒక్క మాల్దా జిల్లాలోనే 2.39 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఆ జిల్లాలోని మహిస్బతని గ్రామపంచాయతీలో 3700 ఓట్లు గల్లంతయ్యాయి. మహిస్బతని పంచాయతీ పరిధిలో కడమటలై, రహుత్రగం, బలౌట్ల, సుగబతన్ గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ సర్ ప్రక్రియకు ముందు మొత్తం 27000 మంది ఓటర్లు ఉండేవారు. తాజాగా వెలువడిన జాబితాలో 3700 ఓటర్ల పేర్లు కనిపించకుండా పోయాయి. దీంతో వారందరికి ఈ నెల 23న జరుగనున్న మొదటి దశ పోలింగ్లో పాల్గొనే అవకాశం లేకుండాపోయింది.
ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు అవసరమైన ధృవీకరణ పత్రాలు సమర్పించాలని ఎన్నికల అధికారులు సూచించారు. అయితే వాటిని ఎక్కడ ఇవ్వాలి, ఎప్పటిలోపు ఇవ్వాలనే విషయమై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ సరైన పత్రాలు సమర్పించినప్పటికీ మొదటి దశ ఎన్నికల్లో వారు ఓటు వేసే అవకాశం మాత్రం ఉండదు. కాగా, మహిస్బతనిలోని ప్రతి పోలింగ్ బూత్లో సుమారు 400 నుంచి 500 ఓటర్ల పేర్లను తొలగించారని ఓ వ్యక్తి తెలిపారు. ఒక్క 23వ నంబర్ పోలింగ్ బూత్లోనే 428 మంది పేర్లు గల్లంతయ్యాయని చెప్పారు. 294 స్థానాలకు గాను మొదటిదశలో 152 స్థానాలకు ఈ నెల 23న పోలింగ్ జరుగనుండటం గమనార్హం.
గత ఏడాది అక్టోబరు చివరి నాటికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 7.66కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ‘సర్’ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు 90.83 లక్షల ఓటర్లను తొలగించారు. 60.06 లక్ష్ల ఓటర్లను అనుమానాస్పద, పెండింగ్ జాబితాలో చేర్చారు. న్యాయాధికారుల పరిశీలన తర్వాత 27.16 లక్షల ఓట్లు తీసేశారు. మిగిలిన 32.68 లక్షల ఓట్లు చెల్లుబాటు అవుతాయని ప్రకటించి జాబితాతాల్లో పేర్లను పునరుద్ధరించారు.
బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా అయిన ఉత్తర 24 పరగణాల జిల్లాలో 3.25 లక్షల ఓట్లు, మాల్దాలో 2.39 లక్షలు, దక్షిణ 24 పరగణాల జిల్లాలో 2.23 లక్షలు, పూర్వ వర్ధమాన్ జిల్లాలో 2.09 లక్షలు.. నాదియా జిల్లాలో 2.98 లక్షల ఓట్లను తీసేశారు. నాదియా, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో మతువా వర్గీయుల జనాభా ఎక్కువగా ఉంటారు.
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

SIR | అర్హులకు ఓటు హక్కు కల్పించడమే సర్ లక్ష్యం : కలెక్టర్ గరిమ అగ్రవాల్
మే 20, 2026

R. G. Kar Medical College | సందీప్ ఘోష్ ప్రాసిక్యూషన్కు అనుమతి.. ఆర్జీకర్ కేసులో బిగుస్తున్న ఉచ్చు
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



