త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ఢిల్లీ పొగమంచు ఎఫెక్ట్.. హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సజీవ దహనం

నార్త్ ఇండియా మొత్తం చలికాలం వల్ల పొగమంచు తీవ్రంగా ఉంటుంది. దీని వల్ల రాత్రి, ఉదయం పొగమంచు దట్టంగా అలుముకుంటుంది. దీంతో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి.

J

National | Published On Dec 16, 2025, 8.40 am IST

ఢిల్లీ పొగమంచు ఎఫెక్ట్.. హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సజీవ దహనం
Advertisement

ఢిల్లీ- ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పొగమంచు కారణంగా దారి సరిగ్గా కనబడక వాహనాలు ఒకదాన్ని మరోటి ఢీకున్నాయి. దీని వల్ల కొన్ని వాహనాల్లో మంటలు చెలరేగాయి. దీంతో నలుగురు సజీవ దహనం కాగా, మరో 25 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన యూపీలోని మథుర సమీపంలో చోటు చేసుకుంది.

దట్టమైన పొగమంచు కారణంగా ముందు వెళ్తున్న వాహనాలు కనిపించక దాదాపు 7 బస్సులు, 3 కార్లు ఒకదాన్ని మరోటి ఢీకున్నాయి. ప్రమాద తీవ్రతకు వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. వాహనాల్లో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించారు. క్రేన్ల సాయంతో యాక్సిడెంట్‌కి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ని క్లియర్ చేశారు.

నార్త్ ఇండియా మొత్తం చలికాలం వల్ల పొగమంచు తీవ్రంగా ఉంటుంది. దీని వల్ల రాత్రి, ఉదయం పొగమంచు దట్టంగా అలుముకుంటుంది. దీంతో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement