త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | కారును ఢీకొట్టిన స్పోర్ట్స్ బైక్.. ఐదుగురు మృతి

Road Accident | బైక్ రేసింగ్ స‌ర‌దా ఐదుగురు అమాయ‌కుల ప్రాణాల‌ను బ‌లి తీసుకున్న‌ది. ఈ ఘోర ప్ర‌మాదం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా ప‌రిధిలోని పాల‌కొండ బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది. అత్యంత వేగంగా దూసుకువ‌చ్చిన స్పోర్ట్స్ బైక్.. కారును ఢీకొట్టింది.

S

Telangana | Published On May 11, 2026, 9.54 am IST

Road Accident | కారును ఢీకొట్టిన స్పోర్ట్స్ బైక్.. ఐదుగురు మృతి
Advertisement

Road Accident | త్రినేత్ర‌.న్యూస్ : బైక్ రేసింగ్ స‌ర‌దా ఐదుగురు అమాయ‌కుల ప్రాణాల‌ను బ‌లి తీసుకున్న‌ది. ఈ ఘోర ప్ర‌మాదం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా ప‌రిధిలోని పాల‌కొండ బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది. అత్యంత వేగంగా దూసుకువ‌చ్చిన స్పోర్ట్స్ బైక్.. కారును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో కారులో ప్ర‌యాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, బైక్‌పై ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు యువ‌కులు స్పాట్‌లోనే చ‌నిపోయారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. స్పోర్ట్స్ బైక్, కారు నుజ్జునుజ్జు అయ్యాయి. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను అర్షియ బేగం(30), ఉజేప‌(7), అమ‌ర్‌(2)గా గుర్తించారు. బైక్‌పై ప్ర‌యాణిస్తున్న వారిని హైద‌రాబాద్‌కు చెందిన యాకుబ్ అఫ్జ‌ల్(25), మ‌రో యువ‌కుడిని అత‌ని స్నేహితుడిగా గుర్తించారు.

ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బైక్ 140 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్లిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఈ రోడ్డు ప్ర‌మాదంలో స్థానికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బైపాస్ రోడ్డులో రాత్రి వేళ యువ‌కులు బైక్ రేసింగ్‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని, పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేద‌ని మండిప‌డ్డారు. బైపాస్‌ను బైక్ రేస‌ర్ల‌కు అడ్డాగా మార్చార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement
Advertisement