త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yadagirigutta Brahmotsavam 2026 | యాదగిరిగుట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు: మురళీకృష్ణుడిగా దర్శనమిచ్చిన లక్ష్మీనరసింహుడు!

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఐదో రోజు స్వామివారు మురళీకృష్ణుడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

J

Nalgonda | Published On Feb 22, 2026, 8.39 pm IST

Yadagirigutta Brahmotsavam 2026 | యాదగిరిగుట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు: మురళీకృష్ణుడిగా దర్శనమిచ్చిన లక్ష్మీనరసింహుడు!
Advertisement

త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన ఆదివారం, స్వామివారు భక్తులకు మురళీకృష్ణుడి (శ్రీకృష్ణుడు) అవతారంలో దర్శనమిచ్చారు.

మురళీకృష్ణుడి అలంకారంలో ఊరేగింపు

ఉదయం నుంచే ఆలయంలో వేద మంత్రోచ్ఛారణలు, విశేష పూజలు నిర్వహించారు. అనంత‌రం స్వామివారిని మురళీకృష్ణుడి అవతారంలో అలంకరించి, ఆలయ తిరుమాఢవీధుల్లో వైభవంగా ఊరేగించారు. చేతిలో వేణువు పట్టుకుని, గోపికా మనోహరుడిగా దర్శనమిచ్చిన నారసింహుడిని చూసి భక్తులు పులకించిపోయారు.

Yadagirigutta Brahmotsavam 2026 Lord Narasimha Appears as Murali Krishna

అనంతరం వేంచేపు మండపంపై స్వామివారిని వేంచేపు చేసి, అర్చకులు వేదమంత్రాలు పఠించారు. స్వామివారి ఈ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.

సాయంత్రం పొన్న వాహన సేవ

బ్రహ్మోత్సవాల క్రమంలో ఐదో రోజు సాయంత్రం స్వామివారికి పొన్న వాహన సేవ నిర్వహించారు. ఈ సేవలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తూ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భవాని శంకర్, అనువంశిక ధర్మకర్త బీ.నరసింహ మూర్తి, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, బట్టర్ సురేంద్రాచార్యులు, ఇతర ఆలయ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Yadagirigutta Brahmotsavam 2026 Lord Narasimha Appears as Murali Krishna

నిత్యం ఒక అవతారంలో..

బ్రహ్మోత్సవాల వేళ స్వామివారు ప్రతిరోజూ ఒక విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ వార్షిక వేడుకలు యాదగిరిగుట్ట కొండపై ఆధ్యాత్మిక శోభను సంతరింపజేశాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement