త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

South Africa | సౌతాఫ్రికాలో తొలిసారి శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి క‌ళ్యాణ మ‌హోత్స‌వం

South Africa | సౌతాఫ్రికాలో తొలిసారిగా శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి క‌ళ్యాణ మ‌హోత్స‌వం అట్ట‌హాసంగా జ‌రిగింది. భ‌క్తులు భారీ సంఖ్య‌లో పాల్గొని త‌న్మ‌య‌త్వం చెందారు.

S

Telangana | Published On May 3, 2026, 3.23 pm IST

South Africa | సౌతాఫ్రికాలో తొలిసారి శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి క‌ళ్యాణ మ‌హోత్స‌వం
Advertisement

South Africa | త్రినేత్ర‌.న్యూస్ : సౌతాఫ్రికాలో తొలిసారిగా శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి క‌ళ్యాణ మ‌హోత్స‌వం అట్ట‌హాసంగా జ‌రిగింది. భ‌క్తులు భారీ సంఖ్య‌లో పాల్గొని త‌న్మ‌య‌త్వం చెందారు. సౌత్ ఆఫ్రికాలోని భక్తి మార్గ టెంపుల్‌లో వెలసిన శ్రీ జ్వాల నరసింహ స్వామి దేవాలయంలో మొట్టమొదటిసారిగా అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని అనుగ్రహాన్ని పొందారు.

ఆది నుండి అంతం వరకు భక్తిభావంతో నిండిన ఈ కళ్యాణ మహోత్సవంలో శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీ నరసింహ స్వామి వారి కళ్యాణం శాస్త్రోక్తంగా, మంగళప్రదంగా నిర్వహించబడింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య, భజనలు, భక్తి గీతాల గానం నేపథ్యంలో కళ్యాణ కార్యక్రమం పూర్వ వైభవంగా జరిగింది.

సమస్త భక్తులు అత్యంత శ్రద్ధాభక్తులతో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి, కళ్యాణ భోజనాన్ని ఆరగించిన అనంతరం ఆనందంగా తమ తమ నివాసాలకు తరలివెళ్లారు. ఈ పవిత్ర మహోత్సవం సౌత్ ఆఫ్రికాలో భారతీయ హిందూ సంస్కృతి వైభవానికి నిదర్శనంగా నిలిచింది.

ఈ కార్యక్రమం గుర్రాల నాగరాజు, ఎల్ఎన్ శర్మ నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ మహోత్సవాన్ని సమస్త విధాలా విజయవంతం చేసిన నిర్వాహకులకు, అర‌వింద్ చికోటి, న‌రేంద‌ర్ రెడ్డితో పాటు ఇత‌ర వాలంటీర్లంద‌రికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారి సేవలు, సహకారం, అంకితభావం లేకుండా ఈ కార్యక్రమం ఇంత సజావుగా, అద్భుతంగా జరగడం సాధ్యమయ్యేది కాదు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అలాగే, ఈ పవిత్ర కార్యక్రమానికి వేదిక కల్పించి సమస్త సహాయ సహకారాలు అందించిన భక్తి మార్గ టెంపుల్ యాజమాన్యానికి, సిబ్బంది అందరికీ నిర్వాహకులు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సమస్త భక్తులకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి అనుగ్రహం సదా కలుగుగాక అని నిర్వాహకులు ఆశీర్వాదాలు అందజేశారు.

Advertisement
Advertisement