త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajinikanth | నాలుగున్న‌ర గంట‌ల ర‌న్‌టైమ్ – విల‌న్‌గా ఐశ్వ‌ర్యా రాయ్ – ర‌జ‌నీకాంత్ న‌ర‌సింహా తెర వెనుక సంగ‌తులివే!

Rajinikanth | ర‌జ‌నీకాంత్ (Rajinikanth) బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ప‌డ‌య‌ప్పా (తెలుగులో న‌ర‌సింహా) సీక్వెల్ రాబోతుంది. ఈ సీక్వెల్‌కు (Sequel) నీలాంబ‌రి అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు ర‌జ‌నీకాంత్ వెల్ల‌డించారు. ర‌జ‌నీకాంత్ బ‌ర్త్‌డేను పుర‌స్క‌రించుకొని న‌ర‌సింహా మూవీ డిసెంబ‌ర్ 12న థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కాబోతుంది.

N

Movies | Published On Dec 9, 2025, 9.22 am IST

Rajinikanth | నాలుగున్న‌ర గంట‌ల ర‌న్‌టైమ్ – విల‌న్‌గా ఐశ్వ‌ర్యా రాయ్ – ర‌జ‌నీకాంత్ న‌ర‌సింహా తెర వెనుక సంగ‌తులివే!

రజనీకాంత్

Advertisement

ప‌డ‌య‌ప్పా ...సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth) ఇమేజ్‌, స్టార్‌డ‌మ్‌ను వ‌ర‌ల్డ్ వైడ్‌గా చాటిచెప్పిన సినిమా. 1999లో రిలీజైన ప‌డ‌య‌ప్పా ( Padayappa) ఆ ఏడాది హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగులో న‌ర‌సింహా పేరుతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన‌ ఈ సినిమా ఇక్క‌డ కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ మ‌ళ్లీ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ర‌జ‌నీకాంత్ వ‌జ్రోత్స‌వంతో పాటు ఆయ‌న బ‌ర్త్‌డేను పుర‌స్క‌రించుకొని డిసెంబ‌ర్ 12న థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ అవుతోంది.
న‌ర‌సింహా రీ రిలీజ్ సంద‌ర్భంగా ఈ సినిమా తెర వెనుక సంగ‌తుల‌ను తెలియ‌జేస్తూ ఓస్పెష‌ల్ వీడియోను అభిమానుల‌తో పంచుకున్నారు ర‌జ‌నీకాంత్‌.
ప‌డ‌య‌ప్పా సినిమాకు సీక్వెల్‌ను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ర‌జ‌నీకాంత్ క‌న్ఫామ్ చేశారు. "ప‌డ‌య‌ప్పా 2కు నీలాంబ‌రి అనే టైటిల్ అనుకుంటున్నాం. ప్ర‌స్తుతం సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది , జైల‌ర్ 2, రోబో 2 లాంటి సీక్వెల్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. న‌ర‌సింహాకు కూడా సీక్వెల్ చేస్తే బాగుంటుంద‌ని అనిపించింది, బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సీక్వెల్ వ‌ర్క‌వుట్ అవుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది" అని ర‌జ‌నీకాంత్‌అన్నారు. ప‌డ‌య‌ప్పాలో నీలాంబ‌రి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టించింది. ఆమె పేరుతో సీక్వెల్‌ను రూపొందించ‌బోతుండ‌టం కోలీవుడ్‌లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.
అంతే కాకుండ ప‌డ‌య‌ప్పా సినిమాకు తానే క‌థ‌ను అందించిన‌ట్లు ర‌జ‌నీకాంత్ వెల్ల‌డించారు. "పొన్నియ‌న్ సెల్వ‌న్ న‌వ‌ల ఆధారంగా ఈ క‌థ‌ను సిద్ధం చేసిన‌ట్లు చెప్పాడు. ఈ సినిమాలో నీలాంబ‌రి పాత్ర కోసం తొలుత ఐశ్వ‌ర్య‌రాయ్‌ని తీసుకోవాల‌ని అనుకున్నాం. కానీ కుద‌ర‌క‌పోవ‌డంతో ర‌మ్య‌కృష్ణ‌ను అప్రోచ్ అయ్యామ‌ని" వెల్ల‌డించాడు.
ప‌డ‌య‌ప్పా సినిమాకు నిర్మాత కూడా తానేన‌ని ర‌జ‌నీకాంత్ వెల్ల‌డించాడు. "నా స్నేహితుల పేర్ల‌తోనే నేనే ఈ సినిమా నిర్మించాం. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ, శాటిలైట్ హ‌క్కుల‌న్ని త‌న ద‌గ్గ‌రే ఉన్నాయ‌ని" చెప్పాడు.
డైరెక్ట‌ర్ కేఎస్ ర‌వికుమార్ కూడా ప‌డ‌య‌ప్పా రీ రిలీజ్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో సినిమాపై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. "ఈ సినిమా నాలుగున్న‌ర గంట‌ల ర‌న్‌టైమ్‌తో రిలీజ్ చేయాల‌ని అనుకున్నాం. రెండు ఇంట‌ర్వెల్స్‌తో స్క్రీనింగ్ చేస్తే బాగుంటుంద‌నే ఐడియా వ‌చ్చింది. కానీ ఆడియెన్స్ నుంచి నెగెటివ్ కామెంట్స్ వ‌స్తాయ‌ని భ‌య‌ప‌డి సినిమాను మూడు గంట‌ల లెంగ్త్‌కు ట్రిమ్ చేశాం" అని చెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement