త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagga Reddy | అధికారంలో ఒక మాట.. ప్రతిపక్షంలో ఒక మాట తగదు : జగ్గారెడ్డి సంచలన ప్రకటన

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వేళ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట చెప్పడం ఏ పార్టీకైనా తగదంటూ ఆయన కుండబద్దలు కొట్టారు.

J

Medak | Published On Apr 23, 2026, 5.13 pm IST

Jagga Reddy | అధికారంలో ఒక మాట.. ప్రతిపక్షంలో ఒక మాట తగదు : జగ్గారెడ్డి సంచలన ప్రకటన
Advertisement

Jagga Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాజకీయాల్లో నిక్కచ్చిగా, ముక్కుసూటిగా మాట్లాడే నేతలలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి ముందువరసలో ఉంటారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతున్న వేళ, జగ్గారెడ్డి సంచలన ప్రకటన రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతోంది. ఇది సొంత పార్టీ కాంగ్రెస్‌కు చురకలా? లేక ప్రతిపక్షాలకు కౌంటరా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

జగ్గారెడ్డి ఏమన్నారంటే?

"కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా.. రాష్ట్రంలో అయినా, కేంద్రంలో అయినా.. అపోజిషన్‌లో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ఎవరు మాట్లాడినా తప్పే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించడం, డిమాండ్ చేయడం.. తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు వాటిని విస్మరించడం ఏ పార్టీ చేసినా తప్పే. ఇట్లు.. జగ్గారెడ్డి" అని ప్రకటించారు.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రాధాన్యత.. ఎవరిని టార్గెట్ చేసినట్లు?

ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వానికి, కార్మికులకు మధ్య డిమాండ్ల పరిష్కారంపై చర్చలు జరుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు అండగా నిలిచింది. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్న తరుణంలో కార్మికులు సమ్మెకు దిగడంతో, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వ వైఖరిని టార్గెట్ చేస్తున్నాయి.

ఈ సమయంలో అధికార పార్టీకి చెందిన కీలక నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది. జగ్గారెడ్డి ఏ ఒక్క పార్టీని కాకుండా.. ప్రధాన పార్టీలన్నింటి (కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ) వైఖరిని ఎండగడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆయన ఉద్దేశం ఎవరిని ఉద్దేశించినదైనా, ఈ సమయంలో ఇలాంటి వాస్తవాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం ఆయనకే ఉందంటూ నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement