Vijaya Dairy | రాష్ట్రంలో కొత్తగా 400 డెయిరీ విజయ డెయిరీ పార్లర్లు.. నిరుద్యోగులకు స్వయం ఉపాధికి ఛాన్స్..!
Vijaya Dairy | తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య వ్యాపార విస్తరణకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో కొత్తగా 400 విజయ డెయిరీ పార్లర్స్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 200 పార్లర్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Karimnagar | Published On Jan 12, 2026, 8.49 pm IST
Vijaya Dairy | తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య వ్యాపార విస్తరణకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో కొత్తగా 400 విజయ డెయిరీ పార్లర్స్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 200 పార్లర్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిమాండ్ మేరకు పార్లర్లను పెంచాలని భావిస్తున్నది. విస్తరణలో భాగంగా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి అవకాశం కల్పించాలని సమాఖ్య నిర్ణయించింది. హైదరాబాద్లోని ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్క్, సికింద్రాబాద్, ఈఎస్ఐ, కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎస్టీయూ మెట్రో స్టేషన్ల వద్ద కొత్తగా పార్లర్లను ప్రారంభించారు. అలాగే, నగరంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, సిద్దిపేట తదితర జిల్లాల్లో కొత్త పార్లర్లను ప్రారంభించనున్నారు.
రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సొంతంగా, లేదంటే అద్దె ప్రాతిపదికన స్థలం ఉండి, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించుకునే వారికి ఈ డెయిరీ పార్లర్ను ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ఆసక్తి ఉన్న వ్యక్తులు రూ.25వేల డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, ఎండీ చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేస్తామన్నారు. మార్కెట్లో విజయ డెయిరీకి మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యితో పాటు ఇతర ఉత్పతులపై కమిషన్ ఉంటుందని తెలిపారు. షాపు అడ్వాన్స్, ఇంటీరియర్, రిఫ్రిజిరేటర్ల కోసం సుమారు రూ.2లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెట్టుబడి అవసరమవుతుందని, పార్లర్ ఉన్న స్థలాన్ని బట్టి రూ.50వేల వరకు ఆదాయం పొందవచ్చని అధికారులు వివరించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



