త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Epstein Files | ఎప్‌స్టీన్ ఫైల్స్ నుంచి ట్రంప్ ఫోటో మాయం.. 16 కీలక పత్రాలను తొలగించిన యూఎస్ సర్కార్

ఓవైపు ఇంకా చాలా ఫైల్స్, ఫోటోలు పబ్లిక్‌లో అప్ లోడ్ అవుతాయని చెబుతున్నా, కీలక సమాచారం గోప్యంగా ఉంచడం వల్ల ఫైల్స్ బహిర్గతంపై పారదర్శకత లోపించిందనే వ్యతిరేకత మాత్రం వ్యక్తమవుతోంది.

J

International | Published On Dec 21, 2025, 10.26 am IST

Epstein Files | ఎప్‌స్టీన్ ఫైల్స్ నుంచి ట్రంప్ ఫోటో మాయం.. 16 కీలక పత్రాలను తొలగించిన యూఎస్ సర్కార్
Advertisement

Epstein Files | అమెరికాలో సంచలనం సృష్టిస్తున్న జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌ విషయంలో మరో అప్‌డేట్ వచ్చింది. ఆ ఫైల్స్ నుంచి యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్న ఫోటో మాయం అయింది. దానితో పాటు కీలక పత్రాలుగా భావిస్తున్న 16 ఫైల్స్ కూడా మిస్ అయ్యాయి. జస్టిస్ డిపార్ట్‌మెంట్(DOJ) పబ్లిక్ వెబ్‌సైట్‌లో ఎప్‌స్టీన్ ఫైల్స్ పేరుతో బిల్ క్లింటన్, మైఖేల్ జాక్సన్ ఉన్న ఫోటోలతో పాలు పలు డాక్యుమెంట్లను అప్ లోడ్ చేశారు. వాటిని అప్ లోడ్ చేసిన 24 గంటల్లోపే కొన్ని ఫోటోలు, డాక్యుమెంట్లను యూఎస్ సర్కారు తొలగించింది.

ప్రభుత్వం దేనిని దాచడానికి ప్రయత్నిస్తోంది?

డీవోజే వెబ్ సైట్ నుంచి తొలగించిన పలు కీలక డాక్యుమెంట్లలో ఎప్‌స్టీన్ నివాసానికి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. వాటిలో డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్, జెఫ్రీ ఎప్‌స్టీన్, గిస్లైన్ మాక్స్‌వెల్ ఉన్నారు. ఆ ఫోటోను ముందు అప్ లోడ్ చేసి ఆ తర్వాత వెబ్ సైట్ నుంచి తీసేశారు. దానితో పాటు పలు కీలక డాక్యుమెంట్లను తొలగించడంపై యూఎస్ ప్రజలు మండిపడుతున్నారు. అసలు ప్రభుత్వం ప్రజల నుంచి ఏం దాచడానికి ప్రయత్నిస్తోంది? ప్రజలకు పారదర్శకత వద్దా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

అసలు పత్రాలు ఏవి?

ప్రభుత్వం వేల పేజీలను బహిర్గతం చేసింది కానీ.. అందులో ఎప్‌స్టీన్ నేరాలకు సంబంధించిన వివరాలు, ఆయనకు శిక్ష పడకుండా కాపాడిన అధికారులు వివరాలు మాత్రం లేవు. ఎఫ్‌బీఐ చేసిన కీలక విచారణ పత్రాలు ఎక్కడ? బాధితుల స్టేట్‌మెంట్స్ ఎక్కడ? అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోందది. ఎప్‌స్టీన్ బాధితులు కూడా ఈ ఫైల్స్ బహిర్గతంపై మండిపడుతున్నారు. న్యాయ వ్యవస్థ కావాలనే మమ్మల్ని ఇంకా మోసం చేస్తోందని బాధితుల్లో ఒకరు తెలిపారు.

ఓవైపు ఇంకా చాలా ఫైల్స్, ఫోటోలు పబ్లిక్‌లో అప్ లోడ్ అవుతాయని చెబుతున్నా, కీలక సమాచారం గోప్యంగా ఉంచడం వల్ల ఫైల్స్ బహిర్గతంపై పారదర్శకత లోపించిందనే వ్యతిరేకత మాత్రం వ్యక్తమవుతోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement