UK | ఇరాన్పై దాడులకు మా సైనిక స్థావరాలు వినియోగించుకోచ్చు.. యూఎస్తో చేతులు కలిపిన యూకే
UK | త్రినేత్ర.న్యూస్: ఇరాన్పై యుద్ధానికి అమెరికాతో మరో దేశం చేతులు కలుపనుంది. హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) దిగ్ద్భందించిన ఇరాన్ క్షిపణి స్థావరాలపై తమ భూభాగంపై నుంచి దాడులు చేయవచ్చంటూ యూకే (UK) ప్రభుత్వం అమెరికాకు (United States) అనుమతి ఇచ్చింది.
International | Published On Mar 21, 2026, 7.48 am IST
UK | త్రినేత్ర.న్యూస్: ఇరాన్పై యుద్ధానికి అమెరికాతో మరో దేశం చేతులు కలుపనుంది. హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) దిగ్ద్భందించిన ఇరాన్ క్షిపణి స్థావరాలపై తమ భూభాగంపై నుంచి దాడులు చేయవచ్చంటూ యూకే (UK) ప్రభుత్వం అమెరికాకు (United States) అనుమతి ఇచ్చింది. తమ సైనిక స్థావరాలను వినియోగించు కోవచ్చంటూ యూకే ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) ప్రకటన విడుదల చేశారు. ఇరాన్తో (Iran) జరిగే యుద్ధంలో బ్రిటన్ నేరుగా పాలుపంచుకోదని గతంలో ప్రకటించిన ఆయన.. మధ్యప్రాచ్యంలో (Middle East) తమ మిత్రదేశాలపై ఇరాన్ దాడులకు పాల్పడుతుండటంతో స్టార్మర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆర్ఏఎఫ్ ఫెయిర్ఫోర్డ్ (RAF Fairford), హిందూ మహాసముద్రంలోని యూఎస్-యూకే సంయుక్త స్థావరమైన డీగో గార్సియాను (Diego Garcia) ఇరాన్పై దాడులకు అమెరికా ఉపయోగించుకోవచ్చని వెల్లడించారు.

అయితే స్టార్మర్ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. యూకే సాయంపై ఇప్పటికే ఆలస్యమైందని, ఈ పని చాలా ముందే చేయాల్సి ఉందని వెల్లడించారు. కాగా, అమెరికాకు యూకే మద్దతివ్వడంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టార్మర్ నిర్ణయం బ్రిటిష్ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిందని చెప్పారు. బ్రిటిష్ ప్రజల్లో చాలా మంది అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో పాల్గొనాలని కోరుకోవడం లేదన్నారు. అమెరికా ఎంతమంది మద్దతు కూడగట్టుకున్నా, ఇరాన్ తన స్వీయరక్షణ హక్కును వినియోగిస్తుందని స్పష్టం చేశారు.
ఐరోపా దేశాల సంయుక్త ప్రకటన..
ఇరాన్, అమెరికా - ఇజ్రాయెల్ యుద్ధంపై గత గురువారం (మార్చి 19న) బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. నౌకలు, ఆయిల్ ట్యాంకర్లను సురక్షితంగా హర్మూజ్ జలసంధి దాటించేందుకు చేపట్టే సముచిత చర్యలకు తోడ్పాటును అందిస్తామని ఆయా దేశాలు వెల్లడించాయి. ప్రపంచ ఇంధన మార్కెట్ల సుస్థిరత కోసం తాము చర్యలను చేపడతామని తెలిపాయి. పశ్చిమాసియా ప్రాంతంలోని దేశాలపై ఇరాన్ దాడులను ఖండించాయి. వెంటనే దాడులను ఆపాలని ఇరాన్కు సూచించాయి. హర్మూజ్ జలసంధి సముద్ర మార్గంలో పరిచిన మైన్లను తొలగించాలని కోరాయి. నౌకలు, ఆయిల్ ట్యాంకర్లపై దాడులను ఆపాలని డిమాండ్ చేశాయి.
సంబంధిత వార్తలు

Fighter Jets | గాల్లో ఢీకొన్న రెండు యుద్ధవిమానాలు.. వీడియో
మే 18, 2026

US Iran Peace Memo | అమెరికా-ఇరాన్ యుద్ధానికి ముగింపు? ‘వన్-పేజీ’ ఒప్పందంతో శాంతి చర్చలకు మార్గం
మే 6, 2026

Strait of Hormuz | ఇరాన్ కొత్త ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్: హార్ముజ్ జలసంధి ఓపెనింగ్పై వీడని సస్పెన్స్
మే 2, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



