Peddi Sudarshan Reddy | ‘పెద్ది’ ఉద్యమ స్ఫూర్తిని ఎప్పటికీ మరువబోం : తన్నీరు మహేశ్
Peddi Sudarshan Reddy | నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి( Peddi Sudarshan Reddy ) ఉద్యమ స్ఫూర్తిని ఎప్పటికీ మరువబోం అని తెలంగాణ ఎన్నారై తన్నీరు మహేశ్ భావోద్వేగానికి లోనయ్యారు.
International | Published On Aug 1, 2026, 7.34 pm IST
Peddi Sudarshan Reddy | త్రినేత్ర.న్యూస్ : నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి( Peddi Sudarshan Reddy ) ఉద్యమ స్ఫూర్తిని ఎప్పటికీ మరువబోం అని తెలంగాణ ఎన్నారై తన్నీరు మహేశ్ భావోద్వేగానికి లోనయ్యారు. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు కృషి చేసిన నిస్వార్థ యోధుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తన్నీరు మహేశ్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్నారైలకు పెద్ది సుదర్శన్ రెడ్డి చాలా దగ్గరి వ్యక్తి. నర్సంపేటలో జరిగిన ప్రతి ఎన్నికలో ప్రత్యక్షంగా పాల్గొని పెద్ది సుదర్శన్ రెడ్డి తరపున ప్రచారం చేసేవాళ్లం. ఆయన చేసిన అభివృద్ధి, మిషన్ కాకతీయ, పాకాల టు రామప్ప లింక్, మెడికల్ కాలేజీ, సైనిక్ స్కూల్ అభివృద్ధి గురించి చెప్తున్నప్పుడు తన కళ్లల్లో ఆనందం, తన ఛాతీలో గర్వం ఉప్పొంగేది. ఆయనలో సంతోషాన్ని చూస్తే మాకు చాలా ఆనందంగా అనిపించేది. ఇందుకు కదా మనం తెలంగాణ తెచ్చుకున్నది. ఇలాంటి నాయకులు కదా మాకు కావాలె అని అనిపించేది. పెద్ది లేకపోవడం ఎన్నారైలకు చాలా బాధాకరం. వారి ఉద్యమ స్ఫూర్తి, అభివృద్ధి స్ఫూర్తి, ఆశయాలు మాకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయి. వారు ఎప్పుడ మాతోనే ఉంటారు అని తన్నీరు మహేశ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Gattu Ramachander Rao | తాంత్రిక విద్యలతో ఆ ముగ్గురిని మట్టుబెట్టాలని చూస్తున్నావా..?
- ●CS Sanjay Jaju | సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం.. ఎజెండా అంశాలపై సమీక్షించిన సీఎస్
- ●Ponguleti Srinivas Reddy | పేదల భూములు మింగిన వారిని వదిలిపెట్టం.. నిషేధిత జాబితాలో ఎంత చేరిందో తేలుస్తం
- ●Maheshkumar Goud | మీడియా సంస్థలు స్వతంత్రంగా ఉండాలి.. లేదంటే నిజాలు బయటికి రావ్
- ●Liquor Shops | హైదరాబాద్లో రెండు రోజులు వైన్స్ బంద్
- ●Guppedantha Manasu Sequel | రిషికి ఐ లవ్ యూ చెప్పిన వసుధార - గుప్పెడంత మనసు 2 పై అప్డేట్?

Gattu Ramachander Rao | తాంత్రిక విద్యలతో ఆ ముగ్గురిని మట్టుబెట్టాలని చూస్తున్నావా..?

CS Sanjay Jaju | సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం.. ఎజెండా అంశాలపై సమీక్షించిన సీఎస్

Ponguleti Srinivas Reddy | పేదల భూములు మింగిన వారిని వదిలిపెట్టం.. నిషేధిత జాబితాలో ఎంత చేరిందో తేలుస్తం

Maheshkumar Goud | మీడియా సంస్థలు స్వతంత్రంగా ఉండాలి.. లేదంటే నిజాలు బయటికి రావ్





