Ponguleti Srinivas Reddy | పేదల భూములు మింగిన వారిని వదిలిపెట్టం.. నిషేధిత జాబితాలో ఎంత చేరిందో తేలుస్తం
Ponguleti Srinivas Reddy | కేంద్ర పైసలు ఇయ్యాకున్నా ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ బిల్లులు చెల్లిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని పేదల భూములు, ప్రభుత్వ భూములను అక్రమంగా కాజేసిన వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు.
- అక్రమాలను బయటపెట్టేందుకు ఫాస్ట్ట్రాక్ విచారణ
- భూముల ధరల సవరణతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం 20% పెరిగింది
- త్వరలో అసైన్డ్ భూములపై సమగ్ర విధాన నిర్ణయం
- కేంద్రం పైసలు ఇయ్యకున్నా ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు చెల్లిస్తం
- సచివాలయ మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు
Ponguleti Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్: కేంద్ర పైసలు ఇయ్యాకున్నా ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ బిల్లులు చెల్లిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని పేదల భూములు, ప్రభుత్వ భూములను అక్రమంగా కాజేసిన వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ధరణి నుంచి భూభారతి వరకు జరిగిన ప్రతి భూ లావాదేవీని ఫాస్ట్ట్రాక్ విధానంలో విచారిస్తున్నామని, అక్రమాలకు పాల్పడిన వారెవరైనా చట్టం ముందు నిలబెట్టడం ఖాయమని హెచ్చరించారు. శనివారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.
కొత్తగా సెంటు భూమి కూడా చేర్చలే..
గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకొని భారీ స్థాయిలో భూ అక్రమాలు, అక్రమ మ్యుటేషన్లు, ప్రభుత్వ భూముల బదిలీలు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రతి వ్యవహారాన్ని ఆధారాలతో సహా పరిశీలిస్తున్నామని చెప్పారు. అన్ని నిజాలను ప్రజల ముందుంచుతామన్నారు. అంతేగాక ఎవరి హయాంలో ఎంత భూమి నిషేధిత జాబితాలో చేరిందో తేలుస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు నిషేధిత జాబితాలో ఎంత భూమి ఉంది? ఆ భూములను ఎవరు, ఎప్పుడు, ఏ కారణాలతో చేర్చారు? తర్వాత ఎందుకు తొలగించారు? అనే ప్రతి అంశంపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కూడా అదే స్థాయిలో పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు. కొత్తగా ఒక్క సెంటు భూమి కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదు.
ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా అంగుళం భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదని మంత్రి స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ధరణి పోర్టల్లో ఉన్న జాబితానే కోర్టుకు సమర్పించామని, వివాదాలు లేని ప్రైవేట్ ఆస్తులు లేదా ప్లాట్లను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు.
276 గ్రామాల్లో సర్వే పూర్తయింది..
రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం రీసర్వే చేపట్టిందని తెలిపారు. ఇప్పటికే 276 గ్రామాల్లో సర్వే పూర్తైందని, ప్రతి సర్వే నంబర్కు ఆధార్ తరహాలో ప్రత్యేక భూధార్ నంబర్ కేటాయిస్తామని చెప్పారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, కేవలం రెండు శాతం మాత్రమే అభ్యంతరాలు వచ్చాయని వివరించారు.
రాష్ట్రంలో సుమారు 85 వేల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని, వాటి విషయంలో సమగ్ర విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని కోణాల్లో ప్రభుత్వం చర్చిస్తోందని తెలిపారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని, ఎవరికీ అనుకూలంగా లేదా వ్యతిరేకంగా వ్యవహరించే ప్రశ్నే లేదని మంత్రి స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే ప్రతి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
క్యూర్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ను చూసి బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. కొల్లూరులో గత ప్రభుత్వం నిర్మించిన 2బీహెచ్కే ఇళ్లలో వర్షం వస్తే నీళ్లు కారుతున్నాయని మీడియా దృష్టికి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అది గత ప్రభుత్వ నాణ్యతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆ ఇళ్లను కూడా మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోయినా, లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఫైనల్ బిల్లులు చెల్లిస్తుందని మంత్రి ప్రకటించారు.
భూముల మార్కెట్ విలువల సవరణ తర్వాత ప్రభుత్వం అంచనా వేసిన దానికంటే 10 నుంచి 20 శాతం వరకు అధిక ఆదాయం వచ్చిందని మంత్రి తెలిపారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వార్షిక ఆదాయం సుమారు రూ.13 వేల కోట్లు ఉండగా, గత ఏడాది అది రూ.15 వేల కోట్లకు చేరిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.18 వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని మంత్రి పొంగులేటి తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Maheshkumar Goud | మీడియా సంస్థలు స్వతంత్రంగా ఉండాలి.. లేదంటే నిజాలు బయటికి రావ్
- ●Liquor Shops | హైదరాబాద్లో రెండు రోజులు వైన్స్ బంద్
- ●Guppedantha Manasu Sequel | రిషికి ఐ లవ్ యూ చెప్పిన వసుధార - గుప్పెడంత మనసు 2 పై అప్డేట్?
- ●Ponnam Prabhakar | సీఎం రేవంత్రెడ్డికి మంత్రి పొన్నం కృతజ్ఞతలు
- ●KTR | ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు ఉన్నాయా..? : కేటీఆర్
- ●HMDA | మొక్కల పెంపకం ఒక ఉద్యమంగా మారాలి

Maheshkumar Goud | మీడియా సంస్థలు స్వతంత్రంగా ఉండాలి.. లేదంటే నిజాలు బయటికి రావ్

Liquor Shops | హైదరాబాద్లో రెండు రోజులు వైన్స్ బంద్

Guppedantha Manasu Sequel | రిషికి ఐ లవ్ యూ చెప్పిన వసుధార - గుప్పెడంత మనసు 2 పై అప్డేట్?

Ponnam Prabhakar | సీఎం రేవంత్రెడ్డికి మంత్రి పొన్నం కృతజ్ఞతలు




