త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CS Sanjay Jaju | స‌ద‌ర‌న్ జోన‌ల్ కౌన్సిల్ స‌మావేశం.. ఎజెండా అంశాల‌పై స‌మీక్షించిన సీఎస్‌

CS Sanjay Jaju | సదరన్‌ జోనల్‌ కౌన్సిల్ స‌మావేశం త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న‌ది. ఈ భేటీలో తెలంగాణ తరఫున ప్రస్తావించాల్సిన అంశాలు, ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు సమీక్ష నిర్వహించారు. శనివారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రానున్న మండలి సమావేశ అజెండాపై చర్చించారు.

P

Telangana | Published On Aug 1, 2026, 7.06 pm IST

CS Sanjay Jaju | స‌ద‌ర‌న్ జోన‌ల్ కౌన్సిల్ స‌మావేశం.. ఎజెండా అంశాల‌పై స‌మీక్షించిన సీఎస్‌
Advertisement

CS Sanjay Jaju | సదరన్‌ జోనల్‌ కౌన్సిల్ స‌మావేశం త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న‌ది. ఈ భేటీలో తెలంగాణ తరఫున ప్రస్తావించాల్సిన అంశాలు, ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు సమీక్ష నిర్వహించారు. శనివారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రానున్న మండలి సమావేశ అజెండాపై చర్చించారు. ఆగస్టు 20న చెన్నైలోని మహాబలిపురంలో జరగనున్న సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలను సీఎస్‌ పరిశీలించారు. తెలంగాణకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఆయా శాఖలు సమగ్రంగా పరిశీలించి, అవసరమైన వివరాలతో సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు.

అంతర్రాష్ట్ర, ప్రాంతీయ సమస్యలకు సంబంధించి కౌన్సిల్‌లో చర్చకు తీసుకురావాల్సిన కీలక అంశాలను గుర్తించాలని ప్రణాళిక శాఖను సీఎస్‌ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న అంశాలపై వెంటనే స్పందించి, వాటికి సంబంధించిన సమాధానాలను రెండు రోజుల్లోగా సిద్ధం చేయాలని సూచించారు. తెలంగాణ ప్రతిపాదనలు, సిఫార్సులను ఖరారు చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సంజయ్‌ జాజు పేర్కొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మార్గదర్శనం కోసం ప్రతిపాదనలను సమర్పించాలని సూచించారు. సమావేశంలో సీనియర్‌ అధికారులు వికాస్‌ రాజ్‌, సబ్యసాచి ఘోష్‌, గౌరవ్‌ ఉప్పల్‌, ఈ శ్రీధర్‌, క్రిస్టినా చోంగ్తు తదితరులు పాల్గొన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన అజెండా అంశాలు, చేపడుతున్న సన్నాహక చర్యలను సీఎస్‌కు వివరించారు.

Advertisement
Advertisement