త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nepal Floods | నేపాల్‌లో వ‌ర‌ద బీభ‌త్సం… వీడియోలు

Nepal Floods | నేపాల్, టిబెట్ స‌రిహ‌ద్దుల్లో ప్ర‌కృతి ప్ర‌కోపం బీభ‌త్సం సృష్టించింది. టిబెట్ ప్రాంతం నుంచి ఉద్భ‌వించే భోటే కోషి న‌దిలో (Koshi River) బుధ‌వారం ఉద‌యం ఒక్క‌సారిగా నీటి మ‌ట్టం పెరగ‌డంతో రాసువా (Rasuwa) జిల్లాలో మెరుపు వ‌ర‌ద‌లు (Nepal Floods) సంభ‌వించాయి.

G

International | Published On Aug 27, 2026, 11.42 am IST

Nepal Floods | నేపాల్‌లో వ‌ర‌ద బీభ‌త్సం… వీడియోలు
Advertisement

Nepal Floods | త్రినేత్ర‌.న్యూస్‌: నేపాల్, టిబెట్ స‌రిహ‌ద్దుల్లో ప్ర‌కృతి ప్ర‌కోపం బీభ‌త్సం సృష్టించింది. టిబెట్ ప్రాంతం నుంచి ఉద్భ‌వించే భోటే కోషి న‌దిలో (Koshi River) బుధ‌వారం ఉద‌యం ఒక్క‌సారిగా నీటి మ‌ట్టం పెరగ‌డంతో రాసువా (Rasuwa) జిల్లాలో మెరుపు వ‌ర‌ద‌లు (Nepal Floods) సంభ‌వించాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు 175 మంది మృతిచెందారు. 826 మంది గ‌ల్లంత‌య్యారు. దీంతో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. ఆచూకీ లేకుండా పోయిన‌వారిలో క‌నీసం 500 మంది విదేశీయులు ఉన్నారు. వారిలో సుమారు 300 మంది భార‌తీయులు ఉన్నారు. ఇందులో కైలాస మాన‌స స‌రోవ‌ర్ యాత్ర‌కు (Kailash Mansarovar Yatra) వెళ్లిన‌వారే 133 మంది ఉన్నారు.

ఆక‌స్మిక వ‌ర‌ద‌ల కార‌ణంగా నేపాల్‌, టిబెట్ ప్రాంతంలోని న‌దుల్లో నీటిమ‌ట్టం ఒక్క‌సారిగా భారీగా పెరిగింది. గల్చి ప్రాంతం వద్ద త్రిశూలి నదిలో 30 నిమిషాల్లో నీరు 9 మీటర్ల ఎత్తుకు ఉప్పొంగింది. భోటే కోషి ఉపనది అయిన లెండేకోలాలోకి భారీగా మంచు, కొండ చరియలు దూసుకువచ్చాయి. ఈ తాకిడి తీవ్రస్థాయిలో ఉండటంతో నది ఒక్కసారిగా ఉప్పొంగింది. ఈ ప్రవాహంలో బండరాళ్లు కిందికి దూసుకొచ్చాయి. ఆ తర్వాత భోటే కోషి నది ద్వారా త్రిశూలి నదిలోకి (Trishuli River) నీటి ప్ర‌వాహం చేరింది. దీని ఫ‌లితంగా భారీ విధ్వంసం సంభ‌వించింది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement
Advertisement