త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Russia Ukraine War | ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. నాలుగేండ్ల‌లో 20 ల‌క్ష‌ల మంది మృతి

Russia Ukraine War | ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య జ‌రుగుతున్న‌ యుద్ధానికి (Russia Ukraine War) నాలుగేండ్లు కావొస్తున్న‌ది. 2022, ఫిబ్ర‌వ‌రి 22న ఉక్రెయిన్‌పై (Ukraine) ర‌ష్యా (Russia) దురాక్ర‌మ‌ణ మొద‌లుపెట్టింది. అంతూపొంతూ లేకుండా సాగుతున్న ఈ యుద్ధం రెండు దేశాల్లో భారీగా ప్రాణ‌, ఆస్తి న‌ష్టాన్ని మిగిల్చింది.

G

International | Published On Jan 29, 2026, 8.55 am IST

Russia Ukraine War | ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. నాలుగేండ్ల‌లో 20 ల‌క్ష‌ల మంది మృతి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య జ‌రుగుతున్న‌ యుద్ధానికి (Russia Ukraine War) నాలుగేండ్లు కావొస్తున్న‌ది. 2022, ఫిబ్ర‌వ‌రి 22న ఉక్రెయిన్‌పై (Ukraine) ర‌ష్యా (Russia) దురాక్ర‌మ‌ణ మొద‌లుపెట్టింది. అంతూపొంతూ లేకుండా సాగుతున్న ఈ యుద్ధం రెండు దేశాల్లో భారీగా ప్రాణ‌, ఆస్తి న‌ష్టాన్ని మిగిల్చింది. ల‌క్ష‌లాది మంది మ‌ర‌ణించగా, కోట్ల‌లో ఆస్తి న‌ష్టం క‌లిగింది. భీకర గగనతల, భూతల దాడుల‌తో సాధారణ ప్రజల కలల సౌధాలు పేకమేడల్లా కూలి నేలమట్టమయ్యాయి. పెద్ద మొత్తంలో మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ప్రజలపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపింది. అనేక మంది డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మ‌రోవైపు అత్యాధునిక ఆయుధాల‌తో ప‌ర‌స్పరం దాడుల‌కు పాల్ప‌డుతుండ‌టంతో ఇరు దేశాలు ఆర్థికంగా ఇప్ప‌ట్లో కోలుకోలేని విధంగా దెబ్బ‌తిన్నాయి.

ఈ నాలుగేండ్ల‌లో రెండు దేశాల్లో మొత్తంగా 20 లక్షల మంది చనిపోయారని ఓ అధ్య‌య‌నంలో తేలింది. ఉక్రెయిన్‌ ప్రతిదాడిలో రష్యాలో కనీసం 12 లక్షల మంది మృతిచెందార‌ని సెంటర్‌ ఫర్‌ స్ట్రాటిజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్ (CSIS) సంస్థ తన నివేదికలో వెల్ల‌డించింది. చనిపోయిన వారిలో 3 ల‌క్ష‌ల 25 వేల మంది సైనికులు ఉన్నారు. మ‌రో 4 ల‌క్ష‌ల 15 వేల‌ మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అంటే ఈ నాలుగు సంవ‌త్స‌రాల‌లో స‌రాస‌రి నెల‌కు సుమారు 35 వేల మంది క్ష‌త‌గాత్రుల‌య్యారు.

ఇక ర‌ష్యా దాడుల్లో ఉక్రెయిన్ త‌న బ‌ల‌గాల్లో ల‌క్షా 40 వేల‌ మందిని కోల్పోయింది. తీవ్రంగా గాయపడటం, జాడ తెలీకుండా పోవడం, శత్రుదేశ సైన్యానికి చిక్కి బందీలుగా రష్యాకు బలవంతంగా తరలిపోయిన కేటగిరీలో మ‌రో 6 ల‌క్ష‌ల‌ మంది ఉన్నారు. కొద్దిపాటి భూభాగం, విలువైన ఖనిజ నిల్వలపై ఆధిపత్యం పొందే క్రమంలో రష్యా భారీ మూల్యం చెల్లించుకుంటున్న‌ద‌ని, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా వంటి అగ్రరాజ్యం ఇంతటి ప్రాణనష్టాన్ని చవిచూడడం చరిత్రలో ఇదే తొలిసార‌ని సీఎస్ఐఎస్ త‌న నివేదికలో వెల్ల‌డించింది. పేర్కొంది.

కాగా, రష్యా, ఉక్రెయిన్‌ అధునాతన ఆయుధాలతో పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ఎక్కడ చూసినా మృత్యువు విలయతాండవం చేస్తోంది. వేలాది మంది అమాయక ప్రజలు అసువులు బాశారు. ఇరువైపుల వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గ్రామాలు, పట్టణాలన్నీ మరుభూములుగా మారిపోయాయి. ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఏళ్ల తరబడి శ్రమించి సాధించిన ప్రగతి ఫలాలు కళ్ల ముందే కనుమరుగైపోయాయి. ఈ యుద్ధంలో రష్యా కంటే ఉక్రెయిన్‌ ఎక్కువగా నష్టపోయింది.

Advertisement

తాజావార్తలు

Advertisement